Medchal Crime: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేేసుకుంది. బాహ్య వలయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ ట్యాంకర్, కారు ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం సాయంత్రం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిరాబాద్ వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన
చర్లపల్లి నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ ఒకటి శనివారం సాయంత్రం బయలుదేరింది. రింగ్ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న ట్యాంకర్ మునిరాబాద్ ప్రాంతం చేరుకుంది. అదే దారిలో వెళ్తున్న ఒక కారును ట్యాంకర్ ఢీకొట్టింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్యాంకర్ రింగ్ రోడ్డుపై నుంచి కిందపడింది. ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ రామరాజు (45) ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రమాదంలో ఢీకొన్న కారు ఉప్పల్ ప్రాంతానికి చెందిన నాగేంద్ర (29) నడుపుతున్నాడు. నాగేంద్ర ఇటీవల కొత్త కారు కొనుగోలు చేశాడు. కారుకు పూజ చేయించుకునేందుకు రింగ్ రోడ్డు మీదుగా ఏడుపాయలకు బయలుదేరాడు. నాగేంద్రతో పాటు మరో నలుగురు బంధువులు కారులో ప్రయాణిస్తున్నారు. ట్యాంకర్ ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.