Siddipet News: సిద్ధిపేట జిల్లా కేంద్రం శివారులోని ప్రసిద్ధ ఎల్లమ్మ గుడి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం కొంతమేర దెబ్బతిన్నప్పటికీ.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై ట్రాఫిక్కు కొంత అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Bihar Politics: పురుషుల అకౌంట్లలోకి రూ.10 వేలు.. లబోదిబో అంటున్న ప్రభుత్వం, తిరిగి ఇవ్వరట!