E-Paper
Advertisement

Satya Sai district: జుట్టు కత్తిరించి.. వివస్త్రను చేసి.. ప్రేమజంటకు సహకరించిందని మహిళపై పైశాచిక దాడి!

Satya Sai district: జుట్టు కత్తిరించి.. వివస్త్రను చేసి..  ప్రేమజంటకు సహకరించిందని మహిళపై పైశాచిక దాడి!

Satya Sai district Crime News: ఏపీలో అమానుష ఘటన జరిగింది. ఓ మహిళ జుట్టును కత్తిరించి, వివస్త్రను చేసి పైశాచికంగా దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ప్రేమ జంటకు సహకరించిందనే అనుమానంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. బాధిత మహిళ బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మహిళ ఇంటిపై మూకుమ్మడి దాడి  

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మునిమడుగులో రీసెంట్ గా ఓ ప్రేమ జంట ఇల్లు వదలి పారిపోయారు. వాళ్లు పారిపోయేందుకు  అదే ఊరికి చెందిన బోయ వెంకటలక్ష్మి సహకరించిందని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులతో పాటు దాదాపు 20 మంది ఆమె ఇంటిపై దాడి చేశారు. వెంకటలక్ష్మి చీర లాగి, జుట్టు కత్తిరించి పైశాచిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కియా ఇండస్ట్రియల్ పీఎస్ పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. బాధితురాలిని చికిత్స కోసం పెనుగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read Also: సంక్రాంతికి ఊరెళ్లిన వారే టార్గెట్, ఏపీ, తెలంగాణలో పలు ఇండ్లను ఊడ్చేసిన దొంగలు!

మునిమడుగులో పోలీస్ పికెటింగ్

ఈ ఘటన పెనుకొండ మండలంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు టీడీపీ, వైసీపీ మధ్య పగలు రేపే అవకాశం ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మునిమడుగులో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. ఊరికి రెండు వైపుల పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కేసును డీఎస్పీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారు బాధిత మహిళకు బంధువులే అవుతారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న వాళ్లంతా మహిళలేనని వెల్లడించారు. మరోవైపు తన మీద దాడి చేసిన వాళ్లు వైసీపీకి చెందిన వాళ్లని బాధిత మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: గేదెల కోసం సీసీ పుటేజ్ వెతుకులాట.. ముగ్గురు దుర్మార్గుల అత్యాచారం సంగతి బట్టబయలు..

Read Also: పదో తరగతి అమ్మాయిల బట్టలు విప్పదీసిన ప్రిన్సిపాల్.. శిక్షపై మండిపడిన పేరేంట్స్

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×