E-Paper
Advertisement

ఏసీబీ వలలో చిక్కిన తిమ్మాజీపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి

ఏసీబీ వలలో చిక్కిన తిమ్మాజీపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి

ACB Raids: స్వేచ్ఛ బ్యూరో: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఓ ఖాకీ. ప్రజలను రక్షించాల్సిన బృహత్ బాధ్యత ఉన్న ఆ పోలీసు అధికారి 30వేల లంచం తీసుకుంటూ రెడ్ హాండెడ్ గా ఒట్టుబడటం నాగర్‌కర్నూల్ జిల్లాలో సంచలనమైంది. ఏసీబీ ఎస్పీ బాలకృష్ణ తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాజిపేటలోఇసుక తరలిస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన ట్రాక్టర్, జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీస్ ఎస్సె హరి ప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేసి వివరాలను నాగర్ కర్నూల్ జిల్లా మైనింగ్ అధికారులకు నివేదించారు. విచారించిన మైనింగ్ అధికారులు ఆ వాహనాలకు 60 వేల రూపాయలు ఫైన్ వేశారు.

30 వేలు ఇస్తేనే..

ఈ డబ్బులను ఈనెల 7వ తేదీన చెల్లించి వాహనాల రిలీజ్ కోసం సంబంధిత పత్రాలను తెచ్చి ఎస్సెకి ఇచ్చాడు. అయితే తనకు 30 వేలు ఇస్తేనే వాహనాలను విడుదల చేస్తానని ఎస్సై డిమాండ్ చేశారు. అని ఎస్సె చెప్పాడు. ఇప్పటికి 30 వేల రూపాయల నిర్మల చెల్లించిన సదరు వాహనదారుడు ఎస్సై మరో 30వేల రూపాయలు డిమాండ్ చేయడంతో ఆ డబ్బులు చెల్లించలేక ఆందోళనకు గురయ్యాడు.

Also Read: జగిత్యాల ఎస్టీ హాస్టల్‌లో దారుణం.. చీపిరితో విద్యార్థులను చితకబాదిన కూరగాయలు కోసే వ్యక్తి!

వాయిస్ రికార్డింగ్..

ఈ క్రమంలో ఎస్సైతో 20వేల వరకు ఇస్తానని మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ లను ఇతర వివరాలతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అన్ని ఆధారాలతో ఏసీబీ అధికారులు సోమవారం పోలీస్ స్టేషన్ కు చేరుకొని బాధితుడి నుండి 20వేల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, ఎస్సైని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు DSP బాలకృష్ణ వెల్లడించారు.

Also Read: కోదాడలోని ఓ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న గ్రామస్తులు

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×