Jagtial ST Hostel: రోజు రోజుకి ప్రభుత్వం హస్టల్లో పిల్లల పరిస్ధతి మరింత దారుణంగా తయారైతుంది. ఓ పక్క ప్రభుత్వం హస్టల్లో పౌష్టిక ఆహరంతో మంచి విద్య నేర్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకు వెలుతుంది. కానీ అందుకు విరుద్దంగా కొంత మంది చేసిన పనులతో అటు ప్రభుత్వానికి సైతం చెడ్డ పేరుతెచ్చేలా కొంత మంది వ్యవహరిస్తున్నారు. సేమ్ అలాంటి సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
జగిత్యాల ఎస్టీ హాస్టల్లో ఒ అమానుష ఘటన చోటు చేసుకుంది. హస్టల్లో నిద్రిస్తున్న పిల్లలను చీపిరితో విద్యార్థులను కూరగాయలను కోసే వ్యక్తి చితకబాదటంతో ఇప్పడు ఇప్పుడు ఆ సంఘటన సంచలనంగా మారింది. ఉదయ కాలం పిల్లను నిద్రలేపాల్సిన సమయంలో వారి పై హస్టల్లో కూరగాయలు కోసే కామటి అనే వ్యక్తి పిల్లలను చీపిరితో బాదుతూ ఒక్కోవిద్యార్దిని లేపుతున్నాడు. ఈ సంఘట అక్క రికార్డు అయింది. దీంతో సాదారణంగా హస్టల్ వార్డెన్ చేయాల్సిన పనులను సక్రమంగా నిర్వర్తించక పోవడం లేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటనతో అధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు.
Also Read: కోదాడలోని ఓ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న గ్రామస్తులు
రోజు మద్యం తాగి వచ్చి కూరగాయాలు కోసే కామటి అనే వ్యక్తి వచ్చి పిల్లలను హింసిస్తూ విధులకు హజరవుతున్నారని అక్కడి విధ్యార్ధులు ఉన్నతాధికారులకు తెలిపారు. గత నాలుగు నెలలుగా ఇలానే మద్యం సేవించి పిల్లను హింసిస్తున్నాడని విద్యార్ధులు తెలిపారు. ఈ సంఘటన పై కొంత మంది విద్యార్ధి నాయకులు ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్కుమార్కు ఫిర్యాదు చేసారు. ఇంత దారుణంగా హింసిస్తున్న వక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్ధి నాయకులు, అక్కడి స్థానికులు కోరారు.
https://twitter.com/bigtvtelugu/status/2038548400074023008
Also read: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కిలేడీ హైడ్రామా..!