E-Paper
Advertisement

పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు.. కోర్టు సంచలన తీర్పు!

పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు.. కోర్టు సంచలన తీర్పు!

Malkajgiri: స్వేచ్ఛ బ్యూరో: పెన్షన్ బెనిఫిట్స్ కోసం కన్న తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురు.  పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి.. ఇంతటి దారుణానికి సహకరించన తల్లి అని తెలియడంతో అందరూ షాక్‌కి గురయ్యారు.

మల్కాజిగిరి నివాసి మారుతి సూతర్ రైల్వే ఉద్యోగి. అతని భార్య గంగాభాయి. వీరి పిల్లలు కిషన్ సూతర్, ప్రపుల్ల. కాగా, మారుతిని చంపితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చని గంగాభాయి, కిషన్, ప్రపుల్ల కలిసి కుట్ర చేశారు. దీంట్లో భాగంగా ఆహారంలో రెండు రోజులు విషం కలిపి ఇచ్చి మారుతిని చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు రోజులు ఇంట్లోనే పెట్టి ముక్కలు ముక్కలు చేసి బయటకు తరలించే యత్నం చేశారు. అయితే, దుర్వాసన రావటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించారు. కేసు విచారించిన కోర్టు కిషన్, ప్రపుల్లలకు మరణ శిక్ష విధించింది. గంగాభాయికి జీవిత కాల శిక్ష వేసింది.

Also Read: హైదరాబాద్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ కలకలం.. గచ్చిబౌలిలో భారీ చోరీ!

Related News

హైదరాబాద్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ కలకలం.. గచ్చిబౌలిలో భారీ చోరీ!

ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి మరో బలి.. నూజివీడులో యువకుడి ఆత్మహత్య!

Crime News: రూపాయలు 110.. ఒక పాత ఫోన్.. ఈ నయా లూటీ కోసం మర్డర్ ప్లాన్ చేసిన డెలివరీ బాయ్స్!

యూట్యూబర్‌ని బోల్తా కొట్టించిన దొంగలు, బంగారం-డబ్బు దోచుకెళ్లారు? అదెలా సాధ్యం

విశాఖలో తీవ్ర విషాదం.. దంపతుల అనుమానాస్పద మృతి!

గేమ్స్ ఆడొద్దన్నందుకు.. కన్నవారిపైనే కత్తితో దాడి చేసిన 16 ఏళ్ల బాలుడు!

కురుక్షేత్ర ఆసుపత్రిలో దారుణం.. రూ.100 ఇచ్చి 15 ఏళ్ల బాలికపై డాక్టర్ అత్యాచారం!

Big Stories

×