Malkajgiri: స్వేచ్ఛ బ్యూరో: పెన్షన్ బెనిఫిట్స్ కోసం కన్న తండ్రిని హత్య చేసిన కొడుకు, కూతురు. పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి.. ఇంతటి దారుణానికి సహకరించన తల్లి అని తెలియడంతో అందరూ షాక్కి గురయ్యారు.
మల్కాజిగిరి నివాసి మారుతి సూతర్ రైల్వే ఉద్యోగి. అతని భార్య గంగాభాయి. వీరి పిల్లలు కిషన్ సూతర్, ప్రపుల్ల. కాగా, మారుతిని చంపితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చని గంగాభాయి, కిషన్, ప్రపుల్ల కలిసి కుట్ర చేశారు. దీంట్లో భాగంగా ఆహారంలో రెండు రోజులు విషం కలిపి ఇచ్చి మారుతిని చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు రోజులు ఇంట్లోనే పెట్టి ముక్కలు ముక్కలు చేసి బయటకు తరలించే యత్నం చేశారు. అయితే, దుర్వాసన రావటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించారు. కేసు విచారించిన కోర్టు కిషన్, ప్రపుల్లలకు మరణ శిక్ష విధించింది. గంగాభాయికి జీవిత కాల శిక్ష వేసింది.
Also Read: హైదరాబాద్లో మరోసారి నేపాలీ గ్యాంగ్ కలకలం.. గచ్చిబౌలిలో భారీ చోరీ!