E-Paper
Advertisement

Crime News: చెల్లితో ప్రేమ.. పార్టీకి అని పిలిచి ఎలా ప్లాన్ చేసి చంపేశారంటే!

Crime News: చెల్లితో ప్రేమ.. పార్టీకి అని పిలిచి ఎలా ప్లాన్ చేసి చంపేశారంటే!
Advertisement

Crime News: ప్రస్తుత కాలంలో ప్రేమ, వివాహేతర సంబంధాల కారణంగా మనుషులు మృగాలు లాగా మారుతున్నారు. మధ్యలో వచ్చిన వారిని ముందు వెనుక ఆలోచించకుండా నరుకుతున్నారు. అయితే ఇది అంతా చెబుతున్నామంటే.. ప్రేమ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. తన చెల్లిని ప్రేమించాడన్న కోపంతో ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేశాడు. అతి గోరాతి గోరంగా ఆ యువకుడిని కొట్టి గొంతు నులిమి ప్రేమికుడి ప్రాణాలను ఆ యువతి అన్న తీసేశాడు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యా్ప్తంగా తీవ్ర సంచలనం రేపుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరంలో యువకుడి మిస్సింగ్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతి ప్రేమ వ్యవహారంలో ఆ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడని పోలీసులు తెలిపారు. హత్య చేసిన నిందితులు భయంతో స్థానిక వీఆర్‌వో దగ్గర లొంగి పోవడంతో అసలు విషయం తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్.

Advertisement

పి.వేమవరంకు చెందిన కార్తీక్‌కు, అదే గ్రామానికి చెందిన యువతితితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇదే విషయంపై యువతి అన్న కృష్ణ ప్రసాద్‌… కార్తీక్‌ను గతంలో మందలించాడు.ప్రేమ వ్యవహారం ఆపక పోవడంతో గత నెల 24న పార్టీకి అని పిలిచి.. బ్రహ్మానందపురంలో ఉన్న ఓ లేఅవుట్లో కార్తీక్‌ను చంపి అక్కడే పూడ్చి పెట్టారు.

Also Read: గద్వాల్ రైతులను ముంచేస్తున్న సీడ్ మాఫియా.. కాపాడాలంటే ఏం చేయాలి?

Advertisement

అయితే కుమారుడు కనిపించకపోవడంతో కార్తీక్‌ తండ్రి వెంకట రమణ ఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత మూడు రోజులుగా మా అబ్బాయి కనిపించడం లేదు అని పోలీసులకు తెలిపాడు. దీంతో కార్తీక్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగించారు. అయితే దీనికంటే ముందే స్థానిక వీఆర్ఓ వద్ద కార్తీక్‌ను చంపినట్లు కృష్ణ ప్రసాద్ అంగీకరించినట్లు తెలిపారు. కృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలను ఆధారంగా తీసుకుని నిందితుడని పాతి పెట్టిన శవాన్ని వెలికితీశారు. అయితే హత్య జరిగి 10 రోజులు కావడంతో కార్తీక్ మృతదేహం కుళ్లిపోయింది. దీంతో పోలీసులు అక్కడే పోస్ట్ మార్టం చేయించారు. తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కార్తీక్ తల్లి స్వరూప, తండ్రి వెంకట రమణ.. హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన కృష్ణ ప్రసాద్‌ను పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×