E-Paper
Advertisement

Delhi News: భర్త ఫోన్ దొంగలించేందుకు ఈ కిలాడీ లేడి ప్లాన్.. అసలు అందులో ఏముందో తెల్సా?

Delhi News: భర్త ఫోన్ దొంగలించేందుకు ఈ కిలాడీ లేడి ప్లాన్.. అసలు అందులో ఏముందో తెల్సా?

Delhi News: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మామూలుగా రోడ్డుపై నడుస్తుంటే మొబైల్ ఫోన్‌ను ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లారు. అయితే, ఈ దొంగతనం వెనుక అతని భార్య ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె తన ప్రేమికుడితో ఉన్న కొన్ని పర్సనల్ ఫోటోలను దాచడానికి ఈ పని చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జూన్ 19న ఢిల్లీ నగరంలోని సుల్తాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

30 ఏళ్ల వ్యక్తి, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు. రోజు లాగానే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా, స్కూటర్‌పై ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు అతని ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు. వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా.. సీసీటీవీ ఫుటేజీ సాయంతో రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని బాలోత్రాకు చెందిన అంకిత్ గెహ్లాట్ (27) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

అంకిత్ విచారణలో ఈ మొబైల్ దొంగతనం బాధితుడి భార్య ఆదేశాల మేరకు జరిగినట్లు వెల్లడించాడు. ఆమె తన మరో వ్యక్తి వివాహేతర సంబంధం కలిగి ఉందని, ఆ ఫోటోలు ఆమె భర్త ఫోన్‌లో ఉన్నాయని తెలిపాడు. ఆమె భర్త మూడు నెలల క్రితం ఆమె ఫోన్‌లో ఈ ఫోటోలను చూసి, వాటిని తన ఫోన్‌కు బదిలీ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె, తన కుటుంబం ముందు బహిర్గతం కాకుండా ఉండేందుకు, తన ప్రేమికుడితో కలిసి ఈ దొంగతనాన్ని ప్లాన్ చేసిందని అంకిత్ గెహ్లాట్ పోలీసులకు వివరించాడు.

ALSO READ: Gali Kireeti : ఎన్టీఆర్ పై అభిమానాన్ని తల్లి ప్రేమతో పోల్చిన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు

అంకిత్‌తో పాటు, ఆమె ప్రేమికుడు కూడా ఈ దొంగతనంలో పాల్గొన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పారు. దొంగిలించిన ఫోన్ నుంచి డేటాను డిలీట్ చేసిన తర్వాత, అది అంకిత్ వద్ద ఉంచినట్టు వివరించారు. పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆమెను కూడా విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సంఘటన దాంపత్య సంబంధాలలో నమ్మకం, రహస్యాలు ఎలా వివాదాస్పద సంఘటనలకు దారితీస్తాయో తెలియజేస్తుంది.

ALSO READ: OTT Movie : క్రిస్మస్ రోజు బయటకొస్తే ఘోరంగా చావులు… ఘోరమైన హారర్, వయొలెన్స్… స్ట్రాంగ్ మైండ్ ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×