Big Stories

Woman Tortures Husband : భర్తను సిగరెట్లతో కాల్చి.. ఛాతీపై కూర్చుని.. నరకం చూపించిన భార్య

Woman Tortures Husband in UP : ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో ఒక వివాహిత తన భర్తను చిత్రహింసలకు గురిచేసింది. అతని శరీర భాగాలను కాల్చి నరకం చూపించింది. భార్య తనను చిత్రహింసలకు గురిచేస్తుందని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సియోహరా జిల్లా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

- Advertisement -

భర్త మనన్ జైదీ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య మెహర్ జహాన్.. తాను మద్యం మత్తులో ఉండగా.. కాళ్లు, చేతులు కట్టివేసి సిగరెట్ తో కాల్చి చిత్రహింసలు పెట్టింది. ఇంటిలోపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలో మెహర్ జహాన్ చిత్రహింసలకు గురిచేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. మనన్ కాళ్లు కట్టేసి.. అతని ఛాతీపై కూర్చుని గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించినట్లు ఫుటేజీలో రికార్డైంది.

- Advertisement -

Also Read : ఫోన్ కాల్స్ విషయంలో గొడవ.. అన్నను చంపేసిన చెల్లెలు!

గతంలో కూడా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. తన భార్య తనకు మత్తుమందు ఇచ్చి.. కాళ్లు, చేతులు కట్టివేసి దుర్భాషలాడిందని వాపోయాడు. హత్యాయత్నం, దాడి, చిత్రహింసలతోపాటు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని పలు సెక్షన్ల కింద మెహర్ జహాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ ధరంపాల్ సింగ్ తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News