BigTV English
Advertisement

Electric Shock: తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Electric Shock: తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Electric Shock: విజయవాడలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందిన ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటన విజయవాడ బెంజ్ సర్కిల్.. నారా చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకుంది.


Also Read: పెళ్లి జరిగిన కొన్ని రోజలకే గొడవపడి వెళ్లిపోయిన వధువు.. బ్రోకర్‌ని హత్య చేసిన వరుడు

నారా చంద్రబాబు నాయుడు కాలనీలో రాజమండ్రికి చెందిన ఓ కుటుంబం నివాసమంటున్నారు. ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్‌ అవ్వడానికి అన్ని సర్దుకున్నారు. ఇంటి ముందున్న ఐరన్ తీగకు బట్టలు ఆరేస్తున్న క్రమంలో కరెంట్‌ షాక్ తగిలింది. ఆమెను కాపాడేందుకు వెళ్ళి మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.. మృతుల్లో ప్రసాద్(61), ఆయన భార్య హేమ వాణి(54), చెల్లెలు ముత్యావల్లి(55)గా గుర్తించారు. భాధితుడు ప్రసాద్ లారీ డ్రైవర్ గా పని చేస్తాడు.. ఈ ఘటన ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.


ఈ దురదృష్ట ఘటనపై విజయవాడ ఈస్ట్‌ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకర మన్నారు.కరెంట్ కేబుల్, బట్టలు ఆరేసే తాడు కలిపి ఉండడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.
వాచ్‌మెన్ అప్రమత్తమై ఫీజ్ తీసే లోపే ప్రాణాలు పోయాయి తెలిపారాయన. ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానన్న ఆయన.. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Related News

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Big Stories

×