Medchal Accident: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్పూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆరుగురు బాలురు ఈతకు వెళ్లారు. అందులో ఇద్దరు గుంతలో పడి మృతి చెందారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం, డబిల్పూర్లోని ఇస్కాన్ ఆలయం సమీపంలో అక్రమంగా మట్టి తవ్వకాల వల్ల లోతైన గుంత ఏర్పడింది. దీంతో చిన్నారులు అక్కడికి వెల్లారు.
Also read: శరీరాన్ని క్లీన్ చేసే డిటాక్స్ వాటర్.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ఆదివారం ఈత కొట్టేందుకు వెళ్లిన ఆరుగురు బాలురలో ఉమన్ (14), అసలమ్ (12) గుంతలో మునిగిపోయారు. మిగతా బాలురు వెంటనే రోడ్డుపైకి వచ్చి ఆర్తనాదాలు చేయడంతో అటుగా వెళ్తున్న ఓ యువకులు స్పందించి వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరేసరికి ఇద్దరు బాలురు మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Also Read: కాక రేపుతున్న నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ రాజకీయం.. కో ఆప్షన్ కోసం కుర్చీలాట..?