E-Paper
Advertisement

Uttar Pradesh : గొయ్యిలో పడిన కారు.. ఆరుగురి మృతి

Uttar Pradesh : గొయ్యిలో పడిన కారు.. ఆరుగురి మృతి
Advertisement
Uttar Pradesh

Uttar Pradesh News today(Telugu news updates):

సోమవారం తెల్లవారుజామున యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండగా.. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నీరు ఉన్న గొయ్యిలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారిలో.. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

ప్రమాద ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు. గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఇంకా గుర్తించలేదని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×