E-Paper
Advertisement

Uttar Pradesh : గొయ్యిలో పడిన కారు.. ఆరుగురి మృతి

Uttar Pradesh : గొయ్యిలో పడిన కారు.. ఆరుగురి మృతి
Uttar Pradesh

Uttar Pradesh News today(Telugu news updates):

సోమవారం తెల్లవారుజామున యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండగా.. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నీరు ఉన్న గొయ్యిలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారిలో.. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు. గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఇంకా గుర్తించలేదని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×