BigTV English

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Visakhapatnam News: విశాఖపట్నం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే గుండెపోటు బారినపడి ఆర్టీసీ బస్సు కండక్టర్ మరణించారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ప్రయాణికుల ముందే జరిగిన ఈ సంఘటనతో బస్సులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఘటన ఎలా జరిగింది?

సమాచారం ప్రకారం, కొట్టాం- విశాఖ కించుమండ మార్గంలో విధులకు హాజరై విశాఖ నుంచి తిరిగి వస్తుండగా.. మార్గమద్యలో సరిపల్లి గ్రామం దగ్గరకు రాగానే గుండెల్లో నొప్పిగా ఉందంటూ డ్రైవర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డ్రైవర్ నాయుడు.. బస్సు వెనక్కి తిప్పి పెందుర్తి ఆసుపత్రికి  తీసుకెళ్లారు.


వైద్యుల ప్రకటన

ఆసుపత్రికి చేరుకునే సరికి వైద్యులు పరీక్షించి చూడగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మృతిచెందిన వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

సహచర ఉద్యోగుల స్పందన

కండక్టర్ మరణం వార్త తెలిసి సహచర ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విధి నిర్వహణలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆర్టీసీ యూనియన్లు, సహచరులు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ప్రయాణికుల అనుభవం

బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ సంఘటనకు షాక్ అయ్యారు. ముందు కండక్టర్ సర్వసాధారణంగా టికెట్లు ఇస్తూ ఉన్నారు. ఒక్కసారిగా అస్వస్థతకు గురవడం మాకు ఆశ్చర్యం కలిగించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా, ఆయన మృతి చెందడం చాలా బాధాకరం అని ఒకరు తెలిపారు.

అధికారులు, సంఘాల చర్యలు

ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, ఉద్యోగులకు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

ఆరోగ్య నిపుణుల సూచనలు

నిపుణుల ప్రకారం, ఒత్తిడి, టైమ్‌కి తినకపోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల గుండెపోటు సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వీరికి క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు చేయడం అత్యవసరమని సూచించారు.

Also Read: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన నిర్ణయం..

 

Related News

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Big Stories

×