Crime News: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సంఘటన సంచలనం రేపింది. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని ఓ గదిలో దాదాపు 35 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read: Constable Controversy: కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం పై.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్
స్ధానికులు చూసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాన్నీ పరిశీలించారు. గాయపడిన మహిళ మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో హత్యకు గల కారణాల పై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దుండగుల కోసం మేడ్చల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: VRA Jobs: గోస పడుతున్న వీఆర్ఏ వారసత్వ ఉద్యోగస్తులు.. పట్టించుకోని అధికారులు