BigTV English

Sri Padmavathi Ammavari Temple: శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు.. రూ.750 చెల్లిస్తే ఆ సేవలు

Sri Padmavathi Ammavari Temple: శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు.. రూ.750 చెల్లిస్తే ఆ సేవలు

Sri Padmavathi Ammavari Temple: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తులకు ఆధ్యాత్మికత, భక్తి పరిపూర్ణతను అందించే పవిత్రక్షేత్రం. ప్రతి ఏడాదీ ఇక్కడ శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహించడం ఇక్కడ సంప్రదాయం. ఈ ఉత్సవాలు ఆలయ పవిత్రతను కాపాడటమే కాకుండా భక్తుల ఆధ్యాత్మిక జీవితానికి కొత్త వెలుగును ప్రసాదిస్తాయి. 2025లో ఈ పవిత్రోత్సవాలు సెప్టెంబరు 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు మూడు రోజులపాటు ఘనంగా జరగనున్నాయి.


పవిత్రోత్సవాలు ప్రత్యేకం

ఉత్సవాలకు ముందుగా సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయంలో భక్తులు, సిబ్బంది వల్ల లోపాలు పవిత్రతకు ఆటంకం కలగకుండా నివారించేందుకు, ప్రతీ ఏడాది పవిత్రోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, హోమాలు వంటి కార్యక్రమాలు ప్రధానంగా ఉంటాయి.


సెప్టెంబరు 5న పవిత్ర ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఉత్సవాల శాస్త్రోక్త ప్రారంభం అవుతుంది. తరువాతి రోజు, సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి, ఆలయానికి పవిత్ర ద్రవ్యాలను సమర్పించడం ద్వారా ఆలయం మొత్తం పవిత్రతతో నిండిపోతుంది. సెప్టెంబరు 7న పూర్ణాహుతి జరుగుతుంది. మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలకు ఈ పూర్ణాహుతి ఒక శుభసంకేతం అవుతుంది.

రూ.750/- చెల్లించి ఆర్జిత సేవ

ఈ పవిత్రోత్సవాలలో గృహస్తులు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఒక్కొక్కరు ఒక రోజు రూ.750/- చెల్లించి ఆర్జిత సేవలో భాగస్వాములు కావచ్చు. సేవలో పాల్గొన్న గృహస్తులకు అమ్మవారి ప్రసాదంగా రెండు లడ్డూలు, రెండు వడలు అందజేస్తారు.

Also Read: TTD Treasury: వెంకన్న ఖజానాలో ఉన్న బంగారం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!

టీటీడీ రద్దు చేసిన సేవలు

ఈ పవిత్రోత్సవాల సందర్భంగా కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది. సెప్టెంబరు 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, సెప్టెంబరు 4న అంకురార్పణ సందర్భంగా జరిగే తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలు రద్దయ్యాయి. అలాగే సెప్టెంబరు 5వ తేదీ అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజలు జరగవు. సెప్టెంబరు 5, 6, 7 తేదీలలో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేదాశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమం

సెప్టెంబరు 2న జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ప్రత్యేకమైన కార్యక్రమం. అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. ఆ తరువాత శుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాక ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు తిరుమంజనం జరుగుతుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి మొదలైన వాటిని నీటితో శుద్ధి చేస్తారు. ఆ తరువాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపి పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ విధంగా ఆలయం అంతా శుద్ధి చేసి పవిత్రతను కలిగిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల నుండి భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు.

ఈ విధంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో జరిగే పవిత్రోత్సవాలు కేవలం ఒక శాస్త్రోక్త కర్మకాండమే కాదు, భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహం, పవిత్రతను అందించే మహోత్సవం. మూడు రోజుల ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ప్రతి భక్తుడికి ఒక విశిష్టమైన అనుభూతిని కలిగిస్తుంది.

Related News

Lord Vinayaka – Moon: చంద్రుడు నవ్వినందుకే చవితి శాపమా? అసలు శాస్త్రీయ కారణం ఇదే!

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే.. ముందు వీటిని అస్సలు ఇంట్లో ఉంచొద్దు

Diwal 2025 Telugu Calendar: తెలుగు క్యాలెండర్ ప్రకారం దీపావళి ఎప్పుడో తెలుసా.. కరెక్ట్ డేట్ ఇదే

Ganesh Chaturthi 2025: వినాయకుడిని 21 పత్రాలతోనే.. ఎందుకు పూజించాలి ?

Mangalwar Ke Upay: చెడు దృష్టి పోవాలంటే.. మంగళవారం ఈ పరిహారాలు చేయండి చాలు !

Big Stories

×