E-Paper
Advertisement

Mahesh Babu: మూడేళ్లు నరకం చూసిన మహేష్ బాబు.. కట్ చేస్తే..!

Mahesh Babu: మూడేళ్లు నరకం చూసిన మహేష్ బాబు.. కట్ చేస్తే..!
Advertisement

Mahesh Babu:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ (Krishna)వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు(Maheshbabu). చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన ఆ తర్వాత హీరోగా మారి తన సత్తా చాటారు. తన వరుస సినిమాలతో ప్రిన్స్ హీరోగా మారి, ఇప్పుడు సూపర్ స్టార్ గా చలామణి అవుతున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా మహేష్ బాబు ఒక మూడు సంవత్సరాల పాటు తన సినీ కెరియర్లో నరకం అంటే ఏంటో చూశారట. ఆ సమయంలో తన భార్య అండగా నిలిచిందని అసలు విషయాన్ని బయటపెట్టారు.

పోకిరి తర్వాత వరుస పరాజయాలు..

Advertisement

సినిమా అనే రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరి కెరియర్ సవ్యంగా సాగుతుందని చెప్పడం అసాధ్యం. ప్రతి నటుడి కెరియర్ లో ఒక డల్ ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మహేష్ బాబుకి కూడా ఎదురయింది. సాధారణంగా ఎవరికైనా ప్లాపుల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఉంటే.. మహేష్ బాబుకి ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సమస్యలు మొదలయ్యాయట.. దాంతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు ఎదుర్కొన్నారు మహేష్ బాబు. అలా సైనికుడు, అతిథి చిత్రాలను మహేష్ బాబు గ్యాప్ లేకుండా చేసినా ఆ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అదే సమయంలో ఫ్యామిలీలో కూడా వరుస విషాదాలు ఆయనను మానసికంగా మరింత దిగ్బ్రాంతికి గురిచేసాయి.

కుటుంబంలో వరుస విషాదాలు..

Advertisement

2006లో పోకిరి రిలీజ్ అయింది. అదే ఏడాది సైనికుడు వచ్చింది. ఆ తర్వాత అతిధి వచ్చింది. అదే సమయంలో నా ఫ్యామిలీలో విషాదాలు కూడా తలుపు తట్టాయి. నన్ను పెంచి పెద్ద చేసిన మా గ్రాండ్ మదర్ మరణించింది. ఆ తర్వాత నమ్రతా తల్లిదండ్రులు కూడా మరణించారు. దీంతో ఒక్కసారిగా శూన్యం ఆవహించింది. ఆ సమయంలో నాకు గౌతమ్ పుట్టాడు. ఈ విషాదాలు జరిగే సమయానికి గౌతం ఆరు నెలల బేబీ. దీంతో కొన్ని నెలలు ఎలాంటి షూటింగ్స్ లేకుండా వాడితో గడపాలని ఆరు నెలలు ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకున్నాను. 6 నెలలు కాస్త మూడు సంవత్సరాలు అయిపోయింది. ఇక సినిమా విషయంలో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాను.

నమ్రతా వల్లే సాధ్యమైంది..

దీనికి తోడు పోకిరి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సైనికుడు, అతిధి సినిమాలు ప్రేక్షకులకు నచ్చలేదు. ఇక పోకిరి రేంజ్ ని మ్యాచ్ చెయ్యాలి అంటే ఎలాంటి సినిమా చేయాలి అనే డైలమాలో పడినప్పుడు నా భార్య నమ్రత (Namrata)నాకు అండగా నిలిచింది. ఆమె ఇచ్చిన ధైర్యమే నన్ను ముందుకు నడిపించింది. తన తల్లిదండ్రులు మరణించిన విషాదంలో ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ కోసం నా కోసం నమ్రత ఎంతో కష్టపడింది. యాడ్ షూట్స్ తో వచ్చిన డబ్బుతోనే మేము కొత్త ఇల్లు కట్టుకున్నాము.ఆ తరువాత ఖలేజా సినిమా చేస్తే అది కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన దూకుడు సినిమాతో మళ్లీ నేను సూపర్ హిట్ అందుకున్నాను అంటూ తెలిపారు మహేష్ బాబు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×