E-Paper
Advertisement

Nayanthara: నయనతార బుద్ది మార్చిన ‘అమ్మోరు తల్లి’… ఎప్పుడూ లేని విధంగా..!

Nayanthara: నయనతార బుద్ది మార్చిన ‘అమ్మోరు తల్లి’… ఎప్పుడూ లేని విధంగా..!
Advertisement

Nayanthara.. సౌత్ ‘లేడీ సూపర్ స్టార్’ అనే ట్యాగ్ తో ఇండస్ట్రీలో చలామణి అవుతున్న నయనతార (Nayanthara) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 19 సంవత్సరాల అవుతున్నా.. ఇప్పటికీ అదే అందంతో, వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. ముఖ్యంగా ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎంతోమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైతే.. నయనతార మాత్రం ఇప్పటికీ హీరోయిన్గా చలామణి అవుతుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సౌత్ ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడిప్పుడే బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టిన ఈమె.. అక్కడ తన సినిమాలతో రూ.1000 కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించారు.

అలా అయితేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్..

Advertisement

ఇకపోతే సినిమాల ద్వారా ఇంత పాపులారిటీ సొంతం చేసుకున్న నయనతార.. ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేముందు ఆ చిత్ర దర్శక నిర్మాతలకు షరతులు పెడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమా విజయవంతం కావాలని మొదట ప్రారంభించే పూజా కార్యక్రమం మొదలు.. సినిమా విడుదల అయ్యేవరకు చేపట్టే ప్రమోషన్స్ కార్యక్రమాలు కానీ, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కానీ , ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకు కానీ ఇలా ఏ కార్యక్రమానికి కూడా నయనతార హాజరుకాదు. ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు దర్శక నిర్మాతలతో ఈ ఒప్పందం కూడా తీసుకుంటుంది. ఇక నయనతార భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్ కావడంతో దర్శక నిర్మాతలు కూడా ఈమె చెప్పిందే వినేవారు. దాంతో ఈమెకు చాలా పొగరు అని , సినిమా ఈవెంట్లకు రాదు అని ఎంతోమంది విమర్శలు గుప్పించిన వారు కూడా లేకపోలేదు.

RC 16 Janhvi Kapoor: బర్త్ డే స్పెషల్ పోస్టర్..జాన్వీ చేతిలో బుజ్జి మేకపిల్ల..!

Advertisement

‘అమ్మోరుతల్లి’ పూజా కార్యక్రమంలో సందడి చేసిన నయనతార..

అయితే అలాంటి నయనతార తాజాగా ఒక సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి ఒక సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో సడన్గా ఈమె బుద్ధి ఇలా మారిపోయింది ఏంటి? అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. నయనతార తమిళ్లో నటించిన ‘మూకుత్తి అమ్మన్’ సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది. ఇదే సినిమా తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి పేరు లభించడంతో.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తీయాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే సుందర్ సి (Sundar.C) దర్శకత్వంలో ‘మూకుత్తి అమ్మన్ 2’ పేరుతో ఈ సినిమాను ప్రారంభించబోతున్నారు. ఇక నిన్న ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నయనతార సందడి చేసింది.నయనతారతో పాటూ రెజీనా (Regina ), మీనా (Meena), కుష్బూ (Kushboo) వంటి స్టార్ కాస్ట్ కూడా కనిపించడంతో ఇంతమంది స్టార్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా పూజా కార్యక్రమానికి రూ.1 కోటి వరకూ ఖర్చు అయినట్లు సమాచారం. అదే సమయంలో తన సినిమా పూజా కార్యక్రమంలో భాగంగా నయనతార పాల్గొనడంతో ఆ అమ్మోరు తల్లే ఈమె బుద్ధి మార్చింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×