E-Paper
Advertisement

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!
Advertisement

Film industry: ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిన తర్వాత చాలామంది లేడీ ఆర్టిస్టులు తమ బాధలను మీడియాతో చెప్పుకుంటున్నారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి చెబితే.. మరి కొంత మంది వ్యక్తిగత విషయాలపై కూడా నోరు మెదుపుతున్నారు. అలా తాజాగా తన వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ ఎమోషనల్ అయింది ప్రముఖ నటి గాయత్రీ గుప్త (Gayatri Gupta). ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో చేసిన ఈమె.. అటు సినిమాలతో పాటు ఇటు వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్లు చేసి సంచలనం సృష్టించిన ఈమె ఇప్పుడు తన కన్న తండ్రి తన పాలిట కసాయిగా మారాడు అంటూ చెప్పుకొచ్చింది.

కన్న తండ్రి దారుణంగా హింసించాడు – గాయత్రి గుప్తా

Advertisement

సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలో ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించిన ఈమె.. గతంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అనే రేంజ్ లో కామెంట్లు చేసింది. ఇప్పుడు తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి తనను పిచ్చిగా కొట్టేవాడు అని.. కరెంటు వైర్లతో కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు అంటూ తెలిపింది..

డ్రాప్ చేస్తామని దాడి చేశారు..

Advertisement

ఇక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనపై చాలా లైంగిక దాడులు కూడా జరిగాయి అంటూ ఎమోషనల్ అయ్యింది గాయత్రి గుప్తా. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ..” ఇలా నేను బహిరంగంగా ఇండస్ట్రీలో జరిగిన విషయాలను కూడా బయటకు చెప్పడం వల్లే ఇండస్ట్రీలో చాలా సమస్యలు వచ్చాయి. అవకాశాలు రాకుండా చేశారు. అయితే నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా కమిట్మెంట్ తో వెళ్లలేదు. ఇదిలా ఉండగా ఒక సినిమా పార్టీలో అనుకోని పరిస్థితుల్లో మందు తాగాల్సి వచ్చింది. అప్పుడు నన్ను ఒక డైరెక్టర్ డ్రాప్ చేస్తానని చెప్పి.. ఒక నిర్మాత ఇంటికి తీసుకెళ్లాడు. ఆరోజు ఆ నిర్మాత నా డ్రెస్ లాగడం, నాతో పిచ్చిగా ప్రవర్తించడం చేశాడు. కానీ నేను వేసుకున్న డ్రెస్సే నన్ను కాపాడింది. ఒక గంట సేపు నన్ను ఇబ్బంది పెట్టి ఇక వర్క్ అవుట్ కాలేదని వదిలేశాడు.. తర్వాత ఒక ఈవెంట్ మేనేజర్ కూడా నాతో చెత్తగా ప్రవర్తించాడు” అంటూ గాయత్రి గుప్తా తెలిపింది.

జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొన్నాను – గాయత్రి గుప్తా

ఇలాంటివి తన జీవితంలో ఎన్నో జరిగాయి అని, నా అనుకున్న వాళ్లు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం గాయత్రి గుప్తా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కన్నా తండ్రి ఇంత దారుణానికి ఒడిగట్టాడు అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక ప్రస్తుతం గాయత్రీ గుప్తా చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

also read: Priyamani: బాలీవుడ్ పై విరుచుకుపడ్డ ప్రియమణి.. ఇప్పటికైనా మారడంటూ?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×