E-Paper
Advertisement

Jr NTR : ఇలా చేస్తే హీరోలు అడుక్కు తింటారు… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Jr NTR : ఇలా చేస్తే హీరోలు అడుక్కు తింటారు… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Jr. NTR: ఈ మధ్యకాలంలో హీరోల అభిమానులు ఏం చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా హీరోలను ఆకాశానికి ఎత్తేయడంలో ముందుంటున్నారు. మరొకవైపు కష్టం వస్తే ఆదుకుంటారని, తమ అభిమాన హీరో వస్తాడని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు కూడా.. అయితే తమకు కష్టం వస్తే.. అభిమాన హీరో సహాయం చేస్తాడా? లేదా? అనే విషయం పక్కన పెడితే.. ఒకవేళ హీరో మరిచిపోయి.. సహాయం చేయకపోతే అభిమానులు పెద్దగా పట్టించుకోరు కానీ పక్క వారు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తారు. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ఆ హీరో సహాయం చేయలేదని, సహాయం చేస్తానని మాట ఇచ్చి తప్పాడు అని రకరకాల కామెంట్లు చేస్తారు. ఇప్పుడు ఇదే విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.NTR)విమర్శలు ఎదుర్కొంటున్నారు. కౌశిక్ అనే క్యాన్సర్ బారిన పడిన యువకుడికి సహాయం చేస్తానని చెప్పి, ఇప్పుడు మాట తప్పాడని బాధిత యువకుడి తల్లి సరస్వతి ఆరోపణలు చేసింది. దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే పెద్ద ఎత్తున ఈ విషయాలు వైరల్ గా మారడంతో ప్రముఖ తెలుగు హీరోయిన్ మాధవి లత (Madhavi Latha) స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆశించేవాళ్లు అభిమానులు ఎలా అవుతారు..

Advertisement

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన కౌశిక్ క్యాన్సర్ తో పోరాడుతూ ఉండగా.. అతడి కోరిక మేరకు గతంలో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన సహాయం చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు స్పందించడం లేదని కౌశిక్ తల్లి సరస్వతి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో హీరోయిన్ మాధవి లత తీవ్రంగా మండిపడ్డారు.” ఈ రకంగా అభిమానులకు హీరోలు డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అడుక్కు తినాలి.. ఆశించే వాళ్ళు అభిమానులు ఎలా అవుతారు?” అంటూ ఆమె ప్రశ్నించింది.. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది మాధవి లతకు సపోర్టుగా నిలుస్తూ.. మీరు చెప్పింది నిజమే.. హీరోలందరూ అభిమానులకు లక్షల రూపాయలను దానం చేస్తూపోతే చివరికి వాళ్ళు అడుక్కుతినాల్సిందే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

క్యాన్సర్ పేషెంట్తో వీడియో కాల్ లో మాట్లాడిన ఎన్టీఆర్.

Advertisement

ఇకపోతే కౌశిక్ అనే ఒక క్యాన్సర్ పేషెంట్ తన అభిమాన హీరో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా విడుదల అయ్యే వరకైనా తనను బ్రతికించండి అంటూ వేడుకున్నారు. దీంతో ఈ విషయం కాస్త ఎన్టీఆర్ అభిమాన సంఘానికి తెలియడంతో వారు ఆయనను సంప్రదించి నేరుగా వీడియో కాల్ మాట్లాడించారు. ఇక అప్పుడు సహాయం చేస్తానని మాట ఇచ్చారట. కానీ ఇప్పుడు ఆ మాట తప్పారని కౌశిక్ తల్లి సరస్వతి ఆరోపణలు చేసింది. దీనికి తోడు ప్రస్తుతం కౌశిక్ చెన్నై లోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. 12 లక్షల రూపాయలు చికిత్స నిమిత్తం ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ సహాయం చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి సహాయం చేయలేదు.. ఆ డబ్బు తాము కట్టలేమని సరస్వతి కామెంట్లు చేసింది.

 

View this post on Instagram

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×