E-Paper
Advertisement

Chiranjeevi: ఓరినీ.. చిరు – శ్రీదేవి సినిమా బ్లాక్ టికెట్స్ బిజినెస్ అదుర్స్.. అప్పట్లో మరీ ఇంత రేటా?

Chiranjeevi: ఓరినీ.. చిరు – శ్రీదేవి సినిమా బ్లాక్ టికెట్స్ బిజినెస్ అదుర్స్.. అప్పట్లో మరీ ఇంత రేటా?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. చిరంజీవి, శ్రీదేవి జంటగా కే రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్రం రిలీజ్ అయి 35 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ నెల మే 9న రీ రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే అత్యున్నతమైన సినిమాగా నిలిచింది. ఈ మూవీ అప్పట్లోనే సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా టికెట్స్ గురించి, ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అప్పట్లో ఈ టికెట్ ఖరీదు 6 రూపాయిలైతే.. బ్లాక్ లో ఎంతకి అమ్మారో ఇప్పుడు చూద్దాం..

బ్లాక్ టికెట్స్ బిజినెస్ అదుర్స్…

మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ సంచలనం. అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మే 9 1990 లో రిలీజ్ చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులను నెలకొల్పింది. ఇన్ని దశాబ్దాలు అయినా సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారంటే.. మెగాస్టార్ శ్రీదేవి కాంబో క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ విడుదలైనప్పుడు టికెట్ రేటు కేవలం 6 రూపాయలు మాత్రమే ఉంది. అప్పట్లో సినిమా మొదటి మ్యాట్నీ షో, నుండి బ్లాక్ మార్కెట్లో టికెట్ను అమ్మేవారిట, 6 రూపాయలు ఉన్న టికెట్ 210 రూపాయలకి బ్లాక్ లో అమ్ముడయ్యాయి. టికెట్టు ధరకి 40 రెట్లు ఎక్కువ పెట్టి మరి ఈ సినిమా చూసారు.. ఎవ్వరు ఊహించని దానికన్నా ఎక్కువ మొత్తంలో అమ్ముడవడంతో అప్పట్లో ఈ సినిమా క్రేజ్ అలాంటిది అని మనకు అర్థమవుతుంది. ఈ సినిమాలోని పాటలు అన్నీ మ్యూజికల్ హిట్టుగా నిలిచాయి. అబ్బనీ తీయని దెబ్బ అనే పాట ఐకానిక్ పాట. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ పాటను ఒక్కరోజులోనే కంపోజ్ చేశామని, ఈ విషయం తెలిసిన ప్రజలు ఆశ్చర్యపోతారని చెప్పారు. ఉదయం 9 గంటలకు షూటింగ్ ప్రారంభించి పాటని మధ్యాహ్నం పూర్తి చేసామని చిరంజీవి తెలిపారు. ఈ పాట గురించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. కథ ప్రకారం హీరో ఒక సామాన్యమైన వ్యక్తి, హీరోయిన్ దేవకన్య, వారిద్దరి మధ్య ప్రేమను తెలియజేయాలంటే ఓ సమర్థవంతమైన పాట కావాలి అని ఈ ఐకానిక్ పాటను కంపోస్ట్ చేశాము అని ఆయన తెలిపారు.

ఆ పాటకోసం అయన కష్టం ..

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలోఓ పాటకోసం ఎంతో కష్టపడ్డారని 106 డిగ్రీల జ్వరంతోను షూటింగ్ కు వచ్చారని, శ్రీదేవి రెండు రోజులు మాత్రమే కాల్ షీట్స్ ఇవ్వడంతో, ఆ రెండు రోజుల్లోనే ఆయన పాట పూర్తి చేయాల్సి ఉండగా, షూటింగ్ కోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్ తర్వాత ఆయన హాస్పిటల్లో చేరి 15 రోజుల తర్వాత డిస్చార్జ్ అయ్యారు అని అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్ ను ఇళయరాజా అందించారు. ఈ చిత్రం మే 9న 1990 సంవత్సరంలో రిలీజ్ అయింది. 2 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు  15 కోట్లు వసూలు సాధించి చిరంజీవి సినిమాల్లోనే ఎక్కువ వసూల్ సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది. అప్పట్లోలోనే ఈ చిత్రానికి 5 నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ సినిమా మే 9న రి రిలీజ్ కానుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×