BigTV English
Advertisement

Chiranjeevi: ఓరినీ.. చిరు – శ్రీదేవి సినిమా బ్లాక్ టికెట్స్ బిజినెస్ అదుర్స్.. అప్పట్లో మరీ ఇంత రేటా?

Chiranjeevi: ఓరినీ.. చిరు – శ్రీదేవి సినిమా బ్లాక్ టికెట్స్ బిజినెస్ అదుర్స్.. అప్పట్లో మరీ ఇంత రేటా?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. చిరంజీవి, శ్రీదేవి జంటగా కే రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్రం రిలీజ్ అయి 35 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ నెల మే 9న రీ రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే అత్యున్నతమైన సినిమాగా నిలిచింది. ఈ మూవీ అప్పట్లోనే సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా టికెట్స్ గురించి, ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అప్పట్లో ఈ టికెట్ ఖరీదు 6 రూపాయిలైతే.. బ్లాక్ లో ఎంతకి అమ్మారో ఇప్పుడు చూద్దాం..


బ్లాక్ టికెట్స్ బిజినెస్ అదుర్స్…

మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఓ సంచలనం. అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా మే 9 1990 లో రిలీజ్ చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులను నెలకొల్పింది. ఇన్ని దశాబ్దాలు అయినా సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారంటే.. మెగాస్టార్ శ్రీదేవి కాంబో క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ విడుదలైనప్పుడు టికెట్ రేటు కేవలం 6 రూపాయలు మాత్రమే ఉంది. అప్పట్లో సినిమా మొదటి మ్యాట్నీ షో, నుండి బ్లాక్ మార్కెట్లో టికెట్ను అమ్మేవారిట, 6 రూపాయలు ఉన్న టికెట్ 210 రూపాయలకి బ్లాక్ లో అమ్ముడయ్యాయి. టికెట్టు ధరకి 40 రెట్లు ఎక్కువ పెట్టి మరి ఈ సినిమా చూసారు.. ఎవ్వరు ఊహించని దానికన్నా ఎక్కువ మొత్తంలో అమ్ముడవడంతో అప్పట్లో ఈ సినిమా క్రేజ్ అలాంటిది అని మనకు అర్థమవుతుంది. ఈ సినిమాలోని పాటలు అన్నీ మ్యూజికల్ హిట్టుగా నిలిచాయి. అబ్బనీ తీయని దెబ్బ అనే పాట ఐకానిక్ పాట. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ పాటను ఒక్కరోజులోనే కంపోజ్ చేశామని, ఈ విషయం తెలిసిన ప్రజలు ఆశ్చర్యపోతారని చెప్పారు. ఉదయం 9 గంటలకు షూటింగ్ ప్రారంభించి పాటని మధ్యాహ్నం పూర్తి చేసామని చిరంజీవి తెలిపారు. ఈ పాట గురించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. కథ ప్రకారం హీరో ఒక సామాన్యమైన వ్యక్తి, హీరోయిన్ దేవకన్య, వారిద్దరి మధ్య ప్రేమను తెలియజేయాలంటే ఓ సమర్థవంతమైన పాట కావాలి అని ఈ ఐకానిక్ పాటను కంపోస్ట్ చేశాము అని ఆయన తెలిపారు.


ఆ పాటకోసం అయన కష్టం ..

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలోఓ పాటకోసం ఎంతో కష్టపడ్డారని 106 డిగ్రీల జ్వరంతోను షూటింగ్ కు వచ్చారని, శ్రీదేవి రెండు రోజులు మాత్రమే కాల్ షీట్స్ ఇవ్వడంతో, ఆ రెండు రోజుల్లోనే ఆయన పాట పూర్తి చేయాల్సి ఉండగా, షూటింగ్ కోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్ తర్వాత ఆయన హాస్పిటల్లో చేరి 15 రోజుల తర్వాత డిస్చార్జ్ అయ్యారు అని అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజిక్ ను ఇళయరాజా అందించారు. ఈ చిత్రం మే 9న 1990 సంవత్సరంలో రిలీజ్ అయింది. 2 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు  15 కోట్లు వసూలు సాధించి చిరంజీవి సినిమాల్లోనే ఎక్కువ వసూల్ సాధించిన చిత్రం గా రికార్డు సృష్టించింది. అప్పట్లోలోనే ఈ చిత్రానికి 5 నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ సినిమా మే 9న రి రిలీజ్ కానుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×