Pushpa 2 – Allu Arjun : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో మంచి పేరును సాధించుకున్నాడు అల్లు అర్జున్. మంచి పేరు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. అలానే పుష్ప సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. పుష్ప సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసమే ఇప్పుడు వస్తున్న పుష్ప 2 సినిమా పైన అందరికీ మంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో టికెట్ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. పుష్ప సినిమా టికెట్ రేట్లు చూస్తుంటే ఒక్కొక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి.
పుష్ప సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో మళ్లీ అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ మొదలైంది. దీనికి అసలు కారణం ఏమిటంటే.? రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్లు నిమిత్తం మా దగ్గరికి వచ్చే సినిమా ప్రముఖులకి ఒక కండిషన్ పెడుతున్నాను. కనీసం రెండు నుంచి మూడు నిమిషాలు నిడివి ఉంటే ఒక అవేర్నెస్ వీడియోని చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. అయితే దాదాపు కొన్నేళ్ల క్రితమే మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ నేరాలు గురించి వీడియోని చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అదే మాదిరిగా ఎన్టీఆర్ కూడా చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి మాదిరిగానే అవేర్నెస్ వీడియోలు చేయాలి అంటూ సినీ ప్రముఖులను కోరారు. అయితే ఇదివరకే ఎన్టీఆర్ కూడా చేయటం వల్ల ఆ వీడియోలు అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Bachhala Malli Teaser: ‘బచ్చల మల్లి’ టీజర్ విడుదల.. అల్లరి నరేశ్లో ఇంత మార్పు ఊహించి ఉండరు!
ఇక పుష్ప సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఇటువంటి అవేర్నెస్ వీడియో ఒకటి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు అల్లు అర్జున్. అయితే ఇలా షేర్ చేయటం హర్షించదగ్గ విషయమే, అని చాలామంది అభిప్రాయం ఏంటంటే ఇప్పటివరకు అల్లు అర్జున్ ఇటువంటి సందేశం ఇవ్వకుండా, ఉన్నపాటుగా ఎందుకు సందేశం ఇస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి టికెట్ రేట్ పెంచుకోవడానికి ఇలా అవేర్నెస్ వీడియో చేశారు అంటూ కొంతమంది వాదన. ఇదే వీడియోను అంతకుముందు ఎందుకు చేయలేదు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కేవలం అల్లు అర్జున్ అవసరం కోసమే నీ అవేర్నెస్ వీడియోని చేశాడు అంటూ కొద్దిమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక పుష్ప సినిమా విషయానికొస్తే రీసెంట్ గానే సెన్సార్ పూర్తయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
Also Read : Pushpa 2 Bookings : పుష్ప2కు నో థియేటర్స్… నైజాంలో అసలేం జరుగుతుంది పుష్ప..?
Let’s unite to support the victims and work towards building a safer, healthier society.
Humbled to join this impactful initiative by the Government of Telangana.@revanth_anumula @TelanganaCMO @TG_ANB @TelanganaCOPs pic.twitter.com/tZ5Rkiw5Lg
— Allu Arjun (@alluarjun) November 28, 2024