Priyamani: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ నడుస్తుంది అన్న వార్తలు వినిపించడం కామన్. కొంతమంది ఆ వార్తలు నిజం చేస్తూ ఆ హీరో హీరోయిన్లు ప్రేమాయణం సాగిస్తూ ఉంటారు. కొన్ని జంటలు వాళ్ళ ప్రేమను పెళ్లి వర్క్ తీసుకెళ్తారు మరికొన్ని జంటలు మధ్యలోనే బ్రేకప్ చెప్పేసుకొని ఎవరి దారిన వాళ్ళు చూసుకుంటారు. ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయిపోయాయి. హీరో హీరోయిన్ల మధ్య ఏదో ఉందని సినిమాలను బట్టి రూమర్స్ కూడా ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇలాంటి రూమర్సే తరుణ్, ప్రియమణి మధ్య వినిపించాయి. అప్పట్లో వీళ్ళిద్దరూ పెళ్లి పీటల వరకు వెళ్లారని కానీ చివరికి ఓ లేడీ వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని, ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వార్తలు నిజం ఎంత ఉందనేది ప్రియమణి రీసెంట్గా ఓ షోలో బయటపెట్టింది. అసలు ఆమె ఏం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం..
తరుణ్ ప్రియమణి హీరో హీరోయిన్గా నవవసంతం సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా షూట్ సమయంలో తరుణ్ ప్రియమణిలు ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు వినిపించాయి.. సినిమా మంచి టాక్ ని అందుకోవడం తో పాటు ఈ జంట బయట ఫ్రెండ్షిప్ కూడా చేయడంతో ఆ వార్తలు నిజమేనని అనుకున్నారు. ఇక వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమయంలో తరుణ్ వాళ్ళ అమ్మ పెళ్లిని క్యాన్సిల్ చేయిందని వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి .
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండింటిని అస్సలు మిస్ అవ్వకండి..
అయితే ప్రియమణి ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్నారు. అందులో భాగంగా సినిమాల గురించి మాట్లాడుతూ.. తరుణ్ తో ఎఫైర్ పై వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చింది. తరుణ్ ప్రియమణి మధ్య రూమర్లు వినిపించడంతో ఇది నిజం అవ్వాలి అని రోజా రమణి ఇద్దరి పెళ్లి చేసి ప్రియమణిని తన ఇంటి కోడలు చేసుకోవాలని ఆశపడిందట. కానీ మధ్యలో ఆర్తి అగర్వాల్ కలగజేసుకోవడంతో వీరి పెళ్లి ఆగిపోయింది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు టాలీవుడ్ మీడియాని కుదిపేసాయి.. వీరి ఇద్దరి పెళ్లి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రియమణి కోపంగా అసలు ఈ చెత్త వార్తలు క్రియేట్ చేసింది ఎవడో కానీ వాడికి నా చేతిలో మూడింది అన్నట్లుగా స్పందించింది. అంతే కాదు ఇంకొకసారి ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తే మాత్రం రియాక్షన్ మరోలా ఉంటుందని, ఇలాంటి వార్తలు క్రియేట్ చేసేవారిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను అంటూ గట్టిగా స్పందించింది. అయితే ఇదే విషయంపై రీసెంట్గా ఓ షోలో కూడా క్లారిటీ ఇచ్చింది. అందులో నిజం లేదు వాడి వ్యూస్ కోసం ఇద్దరి ప్రైవసీని ఇబ్బంది పెట్టారు అని ఆమె మండి పడ్డారు.. ఆ షో ప్రోమో వైరల్ అయ్యింది.. ఆమె కరెక్ట్ గా బుద్ధి చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ప్రియమణి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం లేడీ ఒరియేంటెడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది..