Kannappa enters into second schedule: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘కన్నప్ప’ రూపొందుతోంది. పీరియాడిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ మూవీని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై నటుడు మంచు విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని సుమారు రూ.150 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా స్టార్ ప్లస్ టీవీలో ‘మహాభారత్’ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ‘కన్నప్ప’ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే ఈ మూవీలో ప్రభాస్ నటిస్తుండంతో ‘కన్నప్ప’పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనకు జోడీగా పార్వతి పాత్రలో నటి నయనతార కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్లు ఈ మూవీలో భాగం అయ్యారు. అలాగే మంచు మోహన్ బాబు మనవడు, మంచు విష్ణు కొడుకు అవ్రామ్ భక్త కూడా ఈ మూవీలో కనిపించనున్నాడు.
ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజాగా రెండో షెడ్యూల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ రెండో షెడ్యూల్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా పంచుకున్నారు.
The second schedule of '#𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚🏹' in #NewZealand is in full swing pic.twitter.com/twXyXOtuCE
— Vamsi Kaka (@vamsikaka) February 28, 2024
అందులో మోహన్ బాబు సైతం జాయిన్ అయ్యారు. కాగా ఈ షెడ్యూల్ న్యూజిల్యాండ్లో జరుగుతున్నట్లు విష్ణు పేర్కొన్నాడు. ఇక అక్కడి అధికారులతో డిస్కస్ చేస్తున్న విజువల్స్ కూడా మంచు విష్ణు షేర్ చేసిన వీడియోలో కనిపిస్తుంది. దీని బట్టి ఈ మూవీ యమ స్పీడ్గా చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.