BigTV English

Khushboo: లడ్డూ వివాదంపై ఖుష్బూ ఊహించని కామెంట్స్.. ఇరుక్కోబోతోందా..?

Khushboo: లడ్డూ వివాదంపై ఖుష్బూ ఊహించని కామెంట్స్.. ఇరుక్కోబోతోందా..?

Khushboo.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనే వార్త సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ (Prakash Raj), కోలీవుడ్ హీరో కార్తీ (Karthi)లాంటి తారలు ఈ విషయం పై స్పందించారు కూడా.. అయితే తాజాగా ఈ ఘటనపై బీజేపీ నాయకురాలు , ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ (Khushboo )ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.


లడ్డూ వివాదంపై ఖుష్బూ సంచలన ట్వీట్..

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా.. తిరుమల లడ్డూ లో జంతువుల కొవ్వు కలపడం అత్యంత దారుణం, ఈ చర్యకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరిని కూడా వదిలిపెట్టవద్దు. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే.ముఖ్యంగా మీరు చేసిన తప్పు వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు అంటూ ఖుష్బూ ట్వీట్ చేసింది. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్ గా ఉండమంటే ఎలా.. ఇతర మతాల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారా..? అలాంటి ఆలోచన చేయాలంటేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. ముఖ్యంగా లౌకికవాదం అంటే ప్రతి ఒక్కరూ ప్రతి మతాన్ని గౌరవించడం. అంతేకానీ పక్షపాతంతో వ్యవహరించకూడదు. నేను కూడా హిందూ మతంలో పుట్టకపోయినా , హిందూ మతానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకున్నాను. ముఖ్యంగా నా దృష్టిలో అన్ని మతాలవారు సమానమే. కాబట్టి ఎవరూ కూడా హిందూ మతాన్ని అవమానించవద్దు అలాగే చులకనగా మాట్లాడవద్దు, మతాన్ని అవహేళనగా చూసి అగౌరవపరిస్తే సహించేది లేదు. తిరుమల లడ్డూ లో కల్తీ చేయడం అంటే కోట్లాదిమంది ప్రజల మనోభావాలు, విశ్వాసాలను దెబ్బతీయటమే కదా.. కాబట్టి తప్పకుండా బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నాడు అంటూ ఖుష్బూ తన పోస్టులో తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. ఇలా లడ్డు వివాదంలో కామెంట్ చేసి ఏదైనా సమస్యలో ఇరుక్కోబోతోందా అంటూ నేటిజన్స్ కంగారుపడుతున్నారు.


ఖుష్బూ కెరియర్..

ఖుష్బూ విషయాన్నికొస్తే తెలుగు , తమిళ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ప్రజల పట్ల అలాగే సమాజం పట్ల ఈమెకు చాలా అవగాహన కూడా ఉంది. ఈమె ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ ఆ తర్వాత హిందూ మతానికి చెందిన ప్రముఖ డైరెక్టర్ సుందర్ సి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇకపోతే కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలనే రీతిలో కాకుండా స్వేచ్ఛ జీవితాన్ని అనుభవించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే తన పిల్లల విషయంలో కూడా ఎప్పుడూ ఆమె కఠిన ఆంక్షలు విధించలేదని సమాచారం. ముఖ్యంగా తన పిల్లలను తనలాగే స్వేచ్ఛగా పెంచుతుంది. ఇక ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న ఖుష్బూ. ఇలా లడ్డు వివాదం పై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×