E-Paper
Advertisement

Maha Bharatam: రాజమౌళి తీయబోయే మహాభారతంలో ఆ ముగ్గురు హీరోలు, పర్ఫెక్ట్ ప్లానింగ్ జక్కన్న

Maha Bharatam: రాజమౌళి తీయబోయే మహాభారతంలో ఆ ముగ్గురు హీరోలు, పర్ఫెక్ట్ ప్లానింగ్ జక్కన్న
Advertisement

Maha Bharatam: ప్రతి దర్శకుడికి కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండటం సర్వసాధారణం. కొంతమంది దర్శకులు వాళ్ళు చేయబోయే డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాలను తెరకెక్కించడానికి చాలా టైం తీసుకుంటారు. వాళ్లు ఆ డ్రీమ్ ప్రాజెక్టుకి సరైన న్యాయం చేయగలము అని తెలిసినప్పుడే ఆ ప్రాజెక్టుతో పనిలో దిగుతారు. ఇక దర్శకు ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళికి కూడా ఒక డ్రీం ప్రాజెక్టు ఉన్న సంగతి ఎప్పటినుంచో వింటూనే వస్తున్నాం. అదే ఎస్ ఎస్ రాజమౌళి మహాభారతం. అలానే మహాభారతాన్ని ఎస్ఎస్ రాజమౌళి ప్రేక్షకులకు ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీ కూడా ఉంది. ఎస్ఎస్ రాజమౌళి పలు సందర్భాలలో నా మైండ్ లో ఉన్న మహాభారతాన్ని యాజ్ టీజ్ గా చూపించగలిగితే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. రాజమౌళి టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఎంత ఊహించుకొని సినిమాకి వచ్చినా కూడా దానిని మించిన ఎక్స్పీరియన్స్ అందిస్తుంటాడు. ఇప్పటివరకు రాజమౌళి కెరియర్ లో ఒక్క ఫెయిల్యూర్ సినిమా కూడా లేదు అంటేనే అదే గొప్ప విషయం.

మహాభారతం కోసం పెద్దపెద్ద నటులు

Advertisement

ఎస్ ఎస్ రాజమౌళి తన కెరియర్లో చాలామంది హీరోలతో రిపీటెడ్ గా పనిచేశారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు హీరోలకి కూడా ఎస్.ఎస్ రాజమౌళి స్టార్డం తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. మీరు కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తే దాంట్లో కృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ చేస్తారు అని ఎప్పటినుంచో వినిపిస్తున్న సమాచారం. అలానే ఎన్టీఆర్ కు కూడా తనను రాజమౌళి ఎలా చూపిస్తాడు అనే క్యూరియాసిటీ ఉంది. ఇక దీనిలో ప్రభాస్ కర్ణుడు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇదివరకే కల్కి సినిమాలో కర్ణుడు పాత్రలో ప్రభాస్ కనిపించాడు. అలానే హీరో నాని కూడా మహాభారతంలో భాగం కాబోతున్నట్లు రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చాడు జక్కన్న.

ఐదు సంవత్సరాల తర్వాతే

Advertisement

ఇకపోతే ఎస్ఎస్ రాజమౌళి విషయానికి వస్తే చెప్పిన టైంకి ఎప్పుడు సినిమా రిలీజ్ కాదు. ఒక సినిమాకి ఒక సంవత్సరం పడుతుంది అంటే అది మినిమం టు ఇయర్స్ కి వెళ్ళిపోతుంది. త్రిబుల్ ఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే లేటుగా వచ్చినా కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాడు కాబట్టి ఆ విషయంలో రాజమౌళిని అభిమానులు క్షమించేస్తారు. ఇక ప్రస్తుతం ఎస్.ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న సినిమా మినిమం రెండు సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత మిగతా హీరోలు డేట్ లన్ని కుదిరి మహాభారతం చేసి అది ప్రేక్షకుల ముందుకు రావాలి అని అంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు పడుతుంది అని చెప్పాలి.

Also Read : Muthayya Trailer: ముత్తయ్య ట్రైలర్ రిలీజ్, జక్కన్న రియాక్షన్

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×