E-Paper
Advertisement

Jr. NTR: వంశీ ఇంట బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!

Jr. NTR: వంశీ ఇంట బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..!
Advertisement

Jr. NTR:సెలబ్రిటీ ఇంట్లో ఏ వేడుకైనా అందరూ కలిసి జరుపుకోవడం, ఆ పార్టీలో తీసుకున్న ఫోటోలను, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. హీరో, హీరోలకి మధ్య వ్యత్యాసం ఉండదని, ఇలాంటి పార్టీల ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. పార్టీ ఏదైనా అందరూ ఒక చోట కలవడం, ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకోవడం, అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. వంశీ పైడిపల్లి భార్య మాలిని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీకి సుకుమార్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ హాజరయ్యారు. ఇక్కడ ఒక హీరో మిస్ అయ్యారు.. అతను ఎవరు ఎందుకు రాలేదు.. ఆ పార్టీ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వంశీ ఇంటికి జూనియర్ ఎన్టీఆర్.. మహేష్ మిస్

Advertisement

గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిపిన దర్శకుడు వంశీ పైడిపల్లి. ఈసారి మహేష్ మాత్రం వంశీ భార్య బర్త్డే కి మిస్ అయ్యాడు. మహేష్ వంశీ ఇంటికి ఎప్పుడు ఫ్యామిలీతో సహా వస్తాడు. అలాంటిది ఈసారి మహేష్ ఫ్యామిలీ రాలేదు. ఎందుకంటే మహేష్, దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా షూట్ లో బిజీగా వున్నాడు. ఈరోజు వంశీ పైడిపల్లి భార్య మాలిని పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్, ప్రశాంత్ నీల్ వచ్చారు. మహేష్ బాబు కూడా వచ్చి ఉంటే ఆ ఫోటో ఇంకా కలర్ ఫుల్ గా ఉండేది.

పార్టీ కి వచ్చిన ప్రశాంత్ నీల్, సుకుమార్ డైరెక్టర్స్

Advertisement

తారక్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, వంశీ కాంబోలో వచ్చిన బృందావనం సినిమాలోని కామెడీ సీన్స్ ఇప్పటికి సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి. వారితో పాటు ఈ పార్టీకి లెజెండ్ డైరెక్టర్ ‘ప్రశాంత్ నీల్’ రావడం విశేషం. ‘సలార్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. రాబోయే సినిమాకు ముందుగానే డైరెక్టర్ తో కలిసి తారక్ ఇలా పార్టీలో కనబడడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. వీరితోపాటు వంశీ కుమార్తె ఆధ్యా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

సినిమా విషయానికి వస్తే.. పుష్ప 2 తో సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న సుకుమార్ ఇప్పుడు ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైజ్ గా రూ.1000 కోట్లు దాటి మరోసారి తెలుగు సినిమా సత్తా ఏమిటో చూపింది. తరువాత రామ్ చరణ్ తో RC17 ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే బాలీవుడ్ లోఎంట్రీ ఇస్తూ ‘వార్ 2’ లోహృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. 2019లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”వార్ కి సీక్వెల్ గా ఈ సినిమా రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×