E-Paper
Advertisement

Pooja Hegde: నీ ఏడుపే ఒక ట్రోల్ అయ్యింది.. దాన్ని చూసి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడంటే.. ?

Pooja Hegde: నీ ఏడుపే ఒక ట్రోల్ అయ్యింది.. దాన్ని చూసి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడంటే.. ?

Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే గత రెండేళ్లుగా  వరుస ప్లాప్స్ తో కనీసం కంటికి కూడా కనిపించకుండా తిరిగిన ఈ చిన్నది.. ఈ ఏడాది వరుస సినిమాలను లైన్లో పెట్టింది. ఈ మధ్యనే బాలీవుడ్ లో దేవా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమ్మడు మంచి ఘాటు లిప్ కిస్ ఇచ్చి ట్రోల్ అయ్యింది. మునుపెన్నడూ లేనివిధంగా బాలీవుడ్ లో అవకాశాల కోసం పూజా.. ఇలా లిప్ కిస్ లు ఇస్తుందని నెటిజన్స్ కోడై కూస్తున్నారు. ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడుతుంది.

ఇక ఇది కాకుండా తమిళ్ లో సూర్య సరసన రెట్రో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా పూజకు ఒక లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అమ్మడు చాలా కష్టపడుతుంది. ఇక తాజాగా రెట్రోలో పూజాకు అవకాశం ఎలా వచ్చిందో  చెప్పుకొచ్చింది. అంతేకాకుండా విజయ్ తో మరోసారి నటించడంపై కూడా  స్పందించింది.

” రెట్రోలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఈ రోల్ నాకు దక్కడానికి కారణం రాధేశ్యామ్. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు.. రాధేశ్యామ్ సినిమా చూసి అందులో నా ఎమోషన్ సీన్స్ చూసి  నన్ను ఓకే చేశారు. రెట్రోలో కూడా చాలా  ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పూజా వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

World Cancer Day: క్యాన్సర్ ను జయించిన సెలబ్రిటీలు.. వామ్మో ఇంతమంది స్టార్ హీరోయిన్సా.. ?

గతంలో అమ్మడి ఎమోషనల్ సీన్స్ ను  ట్రోలర్స్ బాగా ట్రోల్ చేశారు. ముఖ్యంగా ఆమె ఏడుస్తుంటే మరీ దారుణంగా ఉందని, హీరోయిన్ గా ఈమెను ఎలా తీసుకున్నారు అంటూ ట్రోల్ చేశారు. చివరకు అసలు ఆ ఏడుపు ఏంట్రా బాబు.. అస్సలు చూడలేకపోతున్నాం అంటూ మీమ్స్ కూడా వేశారు. అలాంటిది ఆ ఎమోషనల్  సీన్స్ చూసి కార్తీక్ సుబ్బరాజు ఎలా హీరోయిన్ గా తీసుకున్నాడు అంటూ ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు.  పూజా ఏడుపులో నీకేం నచ్చింది అన్నా అని కొందరు.. నీ ఏడుపే ఒక ట్రోల్ అయ్యింది.. దాన్ని చూసి ఛాన్స్ వచ్చిందా.. ? అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

ఇక విజయ్ తో కలిసి జన నాయకుడు సినిమాలో నటించడంపై పూజా మాట్లాడుతూ.. ” జన నాయకుడు చిత్రంలో నేను భాగం కావడం నాకు ఆనందంగా ఉంది. విజయ్ చివరి చిత్రం అనగానే ఏమి ఆలోచించలేక. వెంటనే ఒప్పుకున్నాను” అని చెప్పుకొచ్చింది.  ఇప్పటికే విజయ్, పూజా కలిసి బీస్ట్ సినిమాలో నటించారు. ఈ సినిమా పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమాప్లాప్ అవ్వడానికి కారణం కూడా పూజా ఐరెన్ లెగ్ అని కూడా చెప్పుకొచ్చారు. మరి  ఈ సినిమాలతో అమ్మడు కమ్ బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×