E-Paper
Advertisement

Ram Charan: ‘రంగస్థలం’ కాంబోకి రంగం సిద్ధమైంది.. ఈ సారి బాక్సాఫీసు బద్దలే

Ram Charan: ‘రంగస్థలం’ కాంబోకి రంగం సిద్ధమైంది.. ఈ సారి బాక్సాఫీసు బద్దలే
Advertisement
sukumar
sukumar

RC17 – Official announcement  ( Telugu film news ): మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీతో రామ్ చరణ్‌కు మంచి క్రేజ్ వచ్చింది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తన మైండ్ బ్లోయింగ్ స్టోరీతో డైరెక్షన్ చేసి అందరినీ అలరించాడు.

ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబో మళ్లీ ఎప్పుడెప్పుడు సెట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్నవారికి తాజాగా ఓ న్యూస్ సర్ప్రైజ్ అందించింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రామ్ చరణ్ – దర్శకుడు శంకర్ డైరెక్షన్‌‌లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.

Also Read : రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ మూవీల ఓటీటీ డీల్స్ ఫిక్స్.. కోట్లలో బిజినెస్

Advertisement

అందులో ఒకటి సాదా సీదా రాజకీయ నాయకుడిగా, మరొకటి ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది గ్రాండ్‌గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే మరోవైపు దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు.

ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకోగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్‌పై సుకుమార్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

ఇక గేమ్ ఛేంజర్ మూవీతో రామ్ చరణ్, పుష్ప 2 మూవీ సుకుమార్ బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత వీరిద్దరూ మరోసారి కలవనున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరణ్, సుకుమార్ త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: బురద నీళ్లలో చిరంజీవి.. ‘విశ్వంభర’ కోసం మెగాస్టార్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

రామ్ చరణ్ హీరోగా, దర్శకుడిగా సుకుమార్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవీశ్రీ ప్రసాద్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల అంటే మార్చి 27న వెల్లడించనున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.

కాగా ఇటీవలే రామ్ చరణ్, ఉప్పెన ఫేం సానా బుచ్చిబాబుతో ఓ సినిమాను ప్రారంభించారు. ఈ మూవీ తాజాగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×