E-Paper
Advertisement

Sai Pallavi: ఆడియన్స్ ప్రతీసారి నన్ను క్షమించారు.. సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్

Sai Pallavi: ఆడియన్స్ ప్రతీసారి నన్ను క్షమించారు.. సాయి పల్లవి ఆసక్తికర కామెంట్స్
Advertisement

Sai Pallavi: కొందరు భామలు.. హీరోయిన్లుగా పరిచయమయిన కొన్నాళ్లలోనే ఎలాగైనా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ ముందుకు వెళ్దామని అనుకుంటారు. కానీ కొందరు మాత్రం అలా కాదు.. తమకు నచ్చిన కథ, పాత్రలు దొరికేవరకు ఎన్నాళ్లైనా వెయిట్ చేస్తారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. అందుకే తను హీరోయిన్‌గా పరిచయమయ్యి దాదాపు పదేళ్లు అవుతున్నా తను నటించిన సినిమాల సంఖ్య చాలా తక్కువే. అయినా కూడా కాంప్రమైజ్ అవ్వదు ఈ ముద్దుగుమ్మ. అయితే హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్ల తర్వాత తనకు ఫ్లాపులు ఎదురయ్యాయి. ఆ ఫ్లాపులను ఎలా హ్యాండిల్ చేశారు అనే ప్రశ్నకు సాయి పల్లవి ఆసక్తికర సమాధానమిచ్చింది.

తప్పు చేస్తే ఎలా

Advertisement

హీరోయిన్‌గా పరిచయమయిన తర్వాత తన మొదటి ఫ్లాప్‌ను ఎలా తట్టుకుందో, ఆ తర్వాత కమ్‌బ్యాక్ కోసం ఎలా సిద్ధమయ్యిందో తాజాగా బయటపెట్టింది సాయి పల్లవి. ‘‘నా మొదటి ఫ్లాప్ సినిమా నన్ను బాగా ఎఫెక్ట్ చేసింది. నేను నా ఫ్యాన్స్‌కు ఒక బ్యాడ్ మూవీ ఇవ్వాలని అనుకోలేదు. కానీ నా ఫ్యాన్స్ క్షమించారు. నేను కమ్ బ్యాక్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాపై మళ్లీ ప్రేమను కురిపించారు. ఆడియన్స్ ప్రేమను దూరం చేసుకోవాలని ఎవ్వరికీ ఉండదు. నేనేమైనా తప్పు చేస్తే ఈ ప్రేమ దూరమయిపోతుందా అనే భయం ఉంటుంది. నాలో కూడా అలాంటి భయమే ఉండేది. కానీ ఆడియన్స్ మాత్రం ప్రతీసారి నన్ను క్షమించారు’’ అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

Also Read: ‘కూలీ’లో శివకార్తికేయన్ గెస్ట్ రోల్.? క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

Advertisement

కాన్ఫిడెన్స్ వస్తుంది

మామూలుగా ఒక హీరో లేదా హీరోయిన్‌ను ప్రేక్షకులు అభిమానించారంటే వారు చేసిన ఫ్లాప్ సినిమాలను గుర్తుపెట్టుకోరని సాయి పల్లవి అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘మీరు మంచి సినిమా అని నమ్మి అది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లు కూడా అదే ప్రేమతో రిసీవ్ చేసుకుంటారు. ముందు జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడు మీరు చేసిన దానికే వారు ప్రేమిస్తారు. అది యాక్టర్లకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంటే బ్యాడ్ సినిమా చేసినా వారు ఆదరిస్తారని కాదు కానీ వారి ప్రేమను చూసి తరువాత నుండి ఎలాంటి సినిమాలు సెలక్ట్ చేసుకోవాలి అనే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. అదే నేను అర్థం చేసుకున్నది’’ అని తెలిపింది సాయి పల్లవి.

నటనకు మంచి మార్కులు

ఇటీవల సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ‘అమరన్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో తను ఇందు రెబెక్కా వర్గీస్ అనే పాత్రలో అందరినీ అలరించింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటించాడు. ఇందులో శివకార్తికేయన్, సాయి పల్లవి.. ఇద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ప్రస్తుతం సాయి పల్లవి తన తరువాతి సినిమాలపై ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం తన చేతిలో నాగచైతన్యతో కలిసి నటిస్తున్న ‘తండేల్’ ఉంది. దాంతో పాటు బాలీవుడ్‌లో డెబ్యూకు సిద్ధమయ్యింది సాయి పల్లవి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×