E-Paper
Advertisement

Shreya Ghoshal : శ్రేయా ఘోషల్ అకౌంట్ హ్యాక్… ఇన్ని రోజులు ఏం చేశావ్ తల్లీ

Shreya Ghoshal : శ్రేయా ఘోషల్ అకౌంట్ హ్యాక్… ఇన్ని రోజులు ఏం చేశావ్ తల్లీ
Advertisement

Shreya Ghoshal : బాలీవుడ్ లో బెస్ట్ సింగర్ గా పేరు తెచ్చుకున్న స్టార్ సింగర్ శ్రేయా (Shreya Ghoshal) సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఫిబ్రవరి 13 నుండి తన ఖాతా హ్యాక్ అయిందని, అప్పటి నుంచి ఎంతగా ప్రయత్నించినా  మళ్ళీ తన ట్విటర్ అకౌంట్ ను తిరిగి పొందలేకపోయానని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది.

శ్రేయా ఘోషల్ అకౌంట్ హ్యాక్ 

Advertisement

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ లో శ్రేయా  ‘ఫ్రెండ్స్… ఫిబ్రవరి 13న నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయమై నేను X బృందాన్ని సంప్రదించడానికి చాలా ప్రయత్నించాను. కానీ అక్కడి నుంచి ఆటో రెస్పాన్స్ తప్ప సరైన సమాధానం రాలేదు. నా ఖాతాలోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను. కనీసం దాన్ని డిలీట్ చేయలేకపోతున్నాను. దయచేసి ఈ ఖాతా నుండి పంపిన ఏ లింక్‌ పైనా కూడా క్లిక్ చేయవద్దు. అలాగే నా హ్యాక్ అయిన అకౌంట్ లో పోస్ట్ చేసిన దేనినీ నమ్మొద్దు. ఇవన్నీ జనాల్ని మోసం చేయడానికి వాడే లింకులు. అకౌంట్ సెట్ అయ్యాక నేను దాని గురించి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను” అంటూ రాసుకొచ్చింది.

దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రేయా ఘోషల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే ఫిబ్రవరి 13 న అకౌంటు హ్యాక్ అయితే ఇప్పటిదాకా అభిమానులకు చెప్పకుండా ఏం చేశావు? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

శ్రేయా ఘోషల్ తెలుగు సాంగ్స్ 

కాగా శ్రేయ ఘోషల్ బాలీవుడ్ లో స్టార్ సింగర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘చిక్ని చమేలి’, ‘మేరే ధోల్నా’, ‘తేరి యాదోన్ మే’, ‘జలీమా’, ‘యిమి యిమి’, ‘బార్సో రే’ వంటి బ్లాక్ బస్టర్ సాంగ్స్ ను పాడింది. శ్రేయా ఘోషల్ తన వాయిస్ తో ఐదుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ఇక ఈ అమ్మడు తెలుగులో కూడా సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. ఇక తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’ సినిమాలో ‘ప్రేమించే ప్రేమవా’, ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో ‘మధురం కదా’, ‘రాధే శ్యామ్’ మూవీలో ‘నిన్నే లే’, ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో ‘నీ నవ్వే’, ‘పుష్ప 2’ మూవీలో ‘సూసేకి’ సాంగ్స్ ని పాడి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది శ్రేయ ఘోషల్.

ఇటీవల శ్రేయా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊబకాయాన్ని అరికట్టడానికి తీసుకున్న చొరవకు సపోర్ట్ చేసి వార్తల్లో నిలిచింది. “మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యాంటీ-ఒబెసిటీ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ, ప్రపంచ స్థాయిలో తనదైన ముద్ర వేస్తున్నందున ఇది నేటి తరానికి అవసరం. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సరిగ్గా తినాలని, నూనె వాడకాన్ని తగ్గించాలని, చక్కెరను తగ్గించాలని, పోషకాహారం తీసుకోవాలని, టైమ్ కు ఆహారం తీసుకోవాలని, చిన్న పిల్లలకు ఎక్కువ పోషకాహారం ఇవ్వాలని ప్రతిజ్ఞ చేద్దాం. ఆరోగ్యం మన జీవితంలో అతిపెద్ద సంపద. కాబట్టి ఇంట్లో చిన్న మార్పులు చేసుకుని, మన దేశంలో పెద్ద ప్రభావాన్ని చూపిద్దాం” అంటూ వీడియోను షేర్ చేసింది.

 

View this post on Instagram

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×