E-Paper
Advertisement

Director : టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ మిస్సింగ్ కలకలం… టెన్షన్ లో ఫ్యామిలీ

Director : టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ మిస్సింగ్ కలకలం… టెన్షన్ లో ఫ్యామిలీ

Director : టాలీవుడ్ లో ఈ ఏడాది మొదటి నుంచే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఐటి రైడ్స్ అంటూ టాలీవుడ్ నిర్మాతల తాట తీస్తున్నారు ఆర్థిక శాఖ అధికారులు. అయితే మరోవైపు తాజాగా టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది.

20 రోజుల నుంచి కనిపించని డైరెక్టర్…

ప్రముఖ తెలుగు డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (Director Om Ramesh Krishna) హైదరాబాదులో మిస్సయిన ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం 46 ఏళ్ల వయసున్న ఓం రమేష్ కృష్ణ హైదరాబాద్ లోని మియాపూర్ లో ఉన్న ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ తెలుగు డైరెక్టర్ ఈనెల 4వ తేదీన బయటకు వెళ్లారు. కానీ ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజుల నుంచి ఓం రమేష్ కృష్ణ ఆచూకీ కోసం తీవ్రంగా వెతికిన ఫ్యామిలీ మెంబర్స్ చివరకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ మిస్ అయ్యారంటూ ఆయన భార్య శ్రీదేవి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కంప్లైంట్ చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టినట్టు తెలుస్తోంది.

మిస్టరీగా మారిన మిస్సింగ్

డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ ఏకంగా 20 రోజుల పాటు కనిపించకుండా పోవడం అన్నది మిస్టరీగా మారింది. ఏదో వారం లేదా 10 రోజులు అంటే ఎక్కడికైనా ట్రిప్ కి లేదా పని మీద వెళ్ళి ఉంటారు అనుకునే అవకాశం ఉండేది. కానీ ఇన్ని రోజుల పాటు ఆయన ఆచూకీ తెలియకపోవడంతో డైరెక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ లో ఉన్నారు. డైరెక్టర్ రమేష్ కుటుంబ సభ్యులు కూడా ఇన్ని రోజులపాటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకుండా ఆయన వస్తాడని ఎదురు చూడడం విచిత్రంగా అనిపిస్తోంది. ఇక ఇప్పటికే కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆయన సన్నిహితులు, సినీ పరిశ్రమలో డైరెక్టర్ తో కలిసి పని చేస్తున్న వారిని విచారిస్తున్నట్టు సమాచారం. కానీ భార్య కు కూడా సమాచారం ఇవ్వకుండా ఆయన ఇన్ని రోజుల పాటు ఎక్కడికి వెళ్ళాడు? ఏమై ఉంటుంది? అన్న అనుమానాలు నెలకొన్నాయి.

కొనసాగుతున్న ఐటీ రైడ్స్ 

మరోవైపు టాలీవుడ్ లో ఐటీ రైడ్స్ మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి దాదాపు 200 మంది ఐటి అధికారులు టాలీవుడ్ బడా నిర్మాతల ఇల్లు, ఆఫీసులు బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత డిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్, దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాత నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, అభిషేక్ అగర్వాల్ వంటి బడా నిర్మాతలను ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. అలాగే మరోవైపు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా రెండవ రోజు సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ఈ ఐటీ రైడ్స్ టెన్షన్ పడుతుంటే, మరోవైపు డైరెక్టర్ మిస్సింగ్ ఘటన షాకింగ్ గా మారింది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×