BigTV English

20 Killed in Pakistan Bus Accident: ఘోరం.. లోయలోకి జారిపడిన బస్సు.. 20 మంది మృతి..!

20 Killed in Pakistan Bus Accident: ఘోరం.. లోయలోకి జారిపడిన బస్సు.. 20 మంది మృతి..!

20 Killed in Pakistan Bus Accident: పాకిస్థాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండ పై నుంచి లోయలోకి జారిపడటంతో.. 20 మంది వరకూ మరణించారు. గిల్గిత్ – బాల్టిస్థాన్ ప్రాంతం.. డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రావల్పిండి నుంచి హుంజాకు వెళ్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి లోయలో పడిపోయింది.


ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను చిలాస్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై గిల్గిత్ బాల్టిస్థాన్ సీఎం హాజీ గుల్బర్ ఖాన్ దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యుల్ని ఆదేశించారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×