BigTV English

Car crash at Texas: యూఎస్‌లో ఘోరం..టెక్సాస్ రోడ్డు యాక్సిడెంట్.. నలుగురు మృతి.. ముగ్గురు హైదరాబాద్‌వాసులు

Car crash at Texas: యూఎస్‌లో ఘోరం..టెక్సాస్ రోడ్డు యాక్సిడెంట్.. నలుగురు మృతి.. ముగ్గురు హైదరాబాద్‌వాసులు

Car crash at Texas: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు మృతి చెందారు. ముగ్గురు హైదరాబాద్ వాసులు కాగా, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి. హైదరాబాద్‌కు చెందిన ఫరూఖ్, ఆర్యన్ రఘునాథ్, లోకేశ్ పాలచర్ల కాగా, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నాడు.


ప్రమాదం వెనుక అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం. కార్ పూలింగ్ ద్వారా దేశానికి చెందిన నలుగురు వ్యక్తులు బెన్‌టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు వాహనంలో ఎక్కారు. అసలే విశాలమైన హైవే రోడ్లు, దీనికితోడు అతివేగం తోడయ్యింది. వరుసగా ఐదు వాహనాలు వెళ్తున్నాయి.

ALSO READ:  జైలు నుంచి తప్పించుకునేందుకు యత్నం..129 మంది ఖైదీలు మృతి


ఒకదానికి మరొకటి ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ మంటలు అంటుకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపు కారులో నుంచి నలుగురు భారతీయులు బయటపడలేకపోయారు. వీరి మృత దేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. అయితే కారు పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల భారతీయుల వివరాలు బయటకు వచ్చాయి. వీరి మృతిపై ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల్లో ఆర్యన్ రఘునాథ్.. హైదరాబాద్‌కి చెందని మాక్స్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ సంస్థ యజమాని సుభాష్ కొడుకు. వీరి సొంతూరు కర్ణాటక‌లోని రాయచూర్ ప్రాంతం. చాన్నాళ్ల కిందట హైదరాబాద్‌లో సెటిలయ్యారు. రీసెంట్‌గా తమిళనాడులోని అమ‌ృత యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆర్యన్, ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల కిందట అమెరికా వెళ్లాడు. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ పేరెంట్స్ కన్నీరుమున్నీరయ్యారు.

తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ప్రమాదానికి ముందు కొన్ని నిమిషాల ముందు పేరెంట్స్‌తో మాట్లాడారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు సాయం చేయాలని కేంద్రాన్ని వాసుదేవన్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.

 

 

Related News

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Modi To Jinping: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. మరింత బలోపేతం, ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలి

Big Stories

×