E-Paper
Advertisement

Car crash at Texas: యూఎస్‌లో ఘోరం..టెక్సాస్ రోడ్డు యాక్సిడెంట్.. నలుగురు మృతి.. ముగ్గురు హైదరాబాద్‌వాసులు

Car crash at Texas: యూఎస్‌లో ఘోరం..టెక్సాస్ రోడ్డు యాక్సిడెంట్.. నలుగురు మృతి.. ముగ్గురు హైదరాబాద్‌వాసులు

Car crash at Texas: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు మృతి చెందారు. ముగ్గురు హైదరాబాద్ వాసులు కాగా, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి. హైదరాబాద్‌కు చెందిన ఫరూఖ్, ఆర్యన్ రఘునాథ్, లోకేశ్ పాలచర్ల కాగా, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నాడు.

ప్రమాదం వెనుక అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం. కార్ పూలింగ్ ద్వారా దేశానికి చెందిన నలుగురు వ్యక్తులు బెన్‌టోన్ విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు వాహనంలో ఎక్కారు. అసలే విశాలమైన హైవే రోడ్లు, దీనికితోడు అతివేగం తోడయ్యింది. వరుసగా ఐదు వాహనాలు వెళ్తున్నాయి.

ALSO READ:  జైలు నుంచి తప్పించుకునేందుకు యత్నం..129 మంది ఖైదీలు మృతి

ఒకదానికి మరొకటి ఢీకొనడంతో ఒక్కసారిగా భారీ మంటలు అంటుకున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపు కారులో నుంచి నలుగురు భారతీయులు బయటపడలేకపోయారు. వీరి మృత దేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. అయితే కారు పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల భారతీయుల వివరాలు బయటకు వచ్చాయి. వీరి మృతిపై ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల్లో ఆర్యన్ రఘునాథ్.. హైదరాబాద్‌కి చెందని మాక్స్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ సంస్థ యజమాని సుభాష్ కొడుకు. వీరి సొంతూరు కర్ణాటక‌లోని రాయచూర్ ప్రాంతం. చాన్నాళ్ల కిందట హైదరాబాద్‌లో సెటిలయ్యారు. రీసెంట్‌గా తమిళనాడులోని అమ‌ృత యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆర్యన్, ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల కిందట అమెరికా వెళ్లాడు. ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ పేరెంట్స్ కన్నీరుమున్నీరయ్యారు.

తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ప్రమాదానికి ముందు కొన్ని నిమిషాల ముందు పేరెంట్స్‌తో మాట్లాడారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు సాయం చేయాలని కేంద్రాన్ని వాసుదేవన్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.

 

 

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×