E-Paper
Advertisement

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి
Advertisement

Sudan: సూడాన్‌లో ప్రకృతి కన్నెర్ర చేసింది. పశ్చిమ ప్రాంతంలోని మర్రా పర్వత ప్రాంతంలోని ఓ గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో గ్రామమంతా నేలమట్టం అయ్యింది. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

కొద్దిరోజులుగా సుడాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే కొండ కింద ఓ గ్రామంపై భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన ఆగస్టు 31న జరిగిందని స్థానిక ఆర్మీ అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, పురుషులు ఉన్నారని తెలిపారు.గ్రామం పూర్తిగా భూమిలోకి కుంగిపోయిందని వెల్లడించారు.

Advertisement

కొండచరియల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు తగినంత సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి-అంతర్జాతీయ సహాయ సంస్థలను లిబరేషన్ మూవ్‌మెంట్ కోరింది.ఉత్తర డార్ఫుర్ రాష్ట్రంలో సైన్యానికి- రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది ప్రజలు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లారు.

అదే సమయంలో అక్కడ ప్రకృతి వీరిపై కన్నెర్ర చేసింది. ఆహారం, మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్న వారికి విపత్తు రూపంలో మృత్యువాత పడటం అందరినీ కలచి వేసింది. రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల ఆ దేశంలో సగం జనాభా తీవ్ర ఆకలితో అలమటిస్తోంది.

Advertisement

 

 

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×