E-Paper
Advertisement

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి
Advertisement

Sudan: సూడాన్‌లో ప్రకృతి కన్నెర్ర చేసింది. పశ్చిమ ప్రాంతంలోని మర్రా పర్వత ప్రాంతంలోని ఓ గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో గ్రామమంతా నేలమట్టం అయ్యింది. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

కొద్దిరోజులుగా సుడాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే కొండ కింద ఓ గ్రామంపై భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన ఆగస్టు 31న జరిగిందని స్థానిక ఆర్మీ అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, పురుషులు ఉన్నారని తెలిపారు.గ్రామం పూర్తిగా భూమిలోకి కుంగిపోయిందని వెల్లడించారు.

Advertisement

కొండచరియల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు తగినంత సహాయం చేయాలని ఐక్యరాజ్యసమితి-అంతర్జాతీయ సహాయ సంస్థలను లిబరేషన్ మూవ్‌మెంట్ కోరింది.ఉత్తర డార్ఫుర్ రాష్ట్రంలో సైన్యానికి- రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది ప్రజలు మర్రా పర్వత ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లారు.

అదే సమయంలో అక్కడ ప్రకృతి వీరిపై కన్నెర్ర చేసింది. ఆహారం, మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్న వారికి విపత్తు రూపంలో మృత్యువాత పడటం అందరినీ కలచి వేసింది. రెండేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల ఆ దేశంలో సగం జనాభా తీవ్ర ఆకలితో అలమటిస్తోంది.

Advertisement

 

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×