E-Paper
Advertisement

Yemen: యెమెన్ తీరంలో పడవ బోల్తా 68 మంది జల సమాధి, 74 మంది గల్లంతు

Yemen: యెమెన్ తీరంలో పడవ బోల్తా 68 మంది జల సమాధి, 74 మంది గల్లంతు
Advertisement

Yemen: యెమెన్ తీరంలో ప్రతికూల వాతావరణం కారణంగా సుమారు 150 మందితో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో కనీసం 68 మంది జలసమాధి అయ్యారు. మరో 74 మంది జాడ కనిపించలేదు. మృతులంతా ఆఫ్రికా ఖండానికి చెందినవారిగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది.

యెమెన్ తీరంలో ఆదివారం ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించారు. మరో 74 మంది గల్లంతు అయ్యారని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ వెల్లడించింది. జాతుల మధ్య సంఘర్షణ, అధిక పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికాలోని కొన్ని దేశాలు సంపన్నదేశాలు అరబ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో బోట్లపై ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.

Advertisement

ఇథియోపియా నుంచి 154 మంది వలసదారులు పడవలో గల్ఫ్ దేశాలకు బయలుదేరారు. ప్రతికూల వాతావరణం కారణంగా దక్షిణ యెమెన్ ప్రావిన్స్ అబ్యాన్‌లోని అడెన్ తీరానికి సమీపంలో పడవ అదుపు తప్పింది. చివరకు సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో కేవలం 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

ఘటన సమయంలో తీరం వెంబడి గస్తీ కాస్తున్న అధికారులు వారిని రక్షించి సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటల తర్వాత మృతదేహాలు తీరానికి కొట్టుకు వస్తున్నాయి. యెమెన్ తీరంలో జరిగిన వరుస ఓడ ప్రమాదాలలో ఈ విషాదం తాజాది.

Advertisement

ALSO READ: మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన భారీ అగ్నిపర్వతం

154 మంది ఇథియోపియన్ వలసదారులతో ప్రయాణిస్తున్న ఈ నౌక ఆదివారం తెల్లవారుజామున దక్షిణ యెమెన్ ప్రావిన్స్ అబ్యాన్‌లోని అడెన్ గల్ఫ్‌లో మునిగిపోయిందని యెమెన్‌లోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అధిపతి అబ్దుసట్టర్ ఎసోవ్ తెలిపారు.  హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఖండంలో ఇథియోపియా-ఎరిట్రియా లాంటి దేశాల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి.

ఓ వైపు కరవు, ఇంకోవైపు అంతర్యుద్ధం వంటి సమస్యలను చుట్టిముట్టాయి. వీటి నుంచి గట్టెక్కేందుకు గల్ఫ్ దేశాలకు ఆయా దేశాల ప్రజలు వలస వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో యెమెన్‌ని రవాణా మార్గంగా ఎంచుకుంటున్నారు. యెమెన్ మీదుగా ప్రయాణం అత్యంత ప్రమాదకరమని తెలిసినా వలసదారులు వెనక్కి తగ్గలేదు.

ఐఓఎం నివేదికల ప్రకారం.. ప్రపంచంలో రద్దీగా ఉండే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో ఘటన జరిగిన ప్రాంతం ఒకటి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 60 వేల మంది వలసదారులు యెమెన్‌కు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×