E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లీకూతుళ్లు మృతి, పలువురికి గాయాలు

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లీకూతుళ్లు మృతి, పలువురికి గాయాలు

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మంచిర్యాల రెడ్డి కాలనీకి చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. విశ్రాంత సింగరేణి కార్మికుడు పి. విఘ్నేశ్ రమాదేవి దంపతులు, చిన్న కుమార్తె తేజస్వి గృహప్రవేశం కోసం అమెరికా వెళ్లారు. శుక్రవారం పెద్ద కుమార్తె కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి శనివారం తిరిగి వస్తుండగా , వారు ప్రయాణిస్తున్న కారు టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రమాదేవి, ఆమె కుమార్తె తేజస్వి అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలో మంచిర్యాల రెడ్డి కాలనీలో ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తల్లి రమాదేవి (52) ఆమె చిన్న కుమార్తె తేజస్వి (32 సంవత్సరాలు) అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన చికాగో సమీపంలో శనివారం ఉదయం జరిగింది. విశ్రాంత సింగరేణి కార్మికుడు విఘ్నేశ్ ఆయన భార్య రమాదేవి ఇటీవల అమెరికాకు వెళ్లారు. వారి ఇద్దరు కుమార్తెలు – పెద్ద కుమార్తె శ్రావంతి, చిన్న కుమార్తె తేజస్వి – అమెరికాలో స్థిరపడ్డారు. తేజస్వి భర్త కిరణ్ కుమార్, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే ఈ కుటుంబం అక్టోబర్ 18న అమెరికాకు చేరుకుంది. తేజస్వి కొత్త ఇంటికి గృహప్రవేశం చేసుకుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత, శుక్రవారం వారు పెద్ద కుమార్తె శ్రావంతి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లారు. ఆ వేడుకలు ముగిసిన తర్వాత, శనివారం ఉదయం తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారును ఒక టిప్పర్ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో రమాదేవి, తేజస్వి అక్కడికక్కడే మరణించారు. మిగతా కుటుంబ సభ్యులు – విఘ్నేశ్, కిరణ్ కుమార్, తేజస్వి ఇద్దరు పిల్లలు – తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: పవన్ కోసం వర్మ జీరో..? ఆ ఆడియో ఎలా లీకైంది..

ఈ ఘటనపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీని ప ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×