E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లీకూతుళ్లు మృతి, పలువురికి గాయాలు

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తల్లీకూతుళ్లు మృతి, పలువురికి గాయాలు
Advertisement

Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మంచిర్యాల రెడ్డి కాలనీకి చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. విశ్రాంత సింగరేణి కార్మికుడు పి. విఘ్నేశ్ రమాదేవి దంపతులు, చిన్న కుమార్తె తేజస్వి గృహప్రవేశం కోసం అమెరికా వెళ్లారు. శుక్రవారం పెద్ద కుమార్తె కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి శనివారం తిరిగి వస్తుండగా , వారు ప్రయాణిస్తున్న కారు టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రమాదేవి, ఆమె కుమార్తె తేజస్వి అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలో మంచిర్యాల రెడ్డి కాలనీలో ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తల్లి రమాదేవి (52) ఆమె చిన్న కుమార్తె తేజస్వి (32 సంవత్సరాలు) అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన చికాగో సమీపంలో శనివారం ఉదయం జరిగింది. విశ్రాంత సింగరేణి కార్మికుడు విఘ్నేశ్ ఆయన భార్య రమాదేవి ఇటీవల అమెరికాకు వెళ్లారు. వారి ఇద్దరు కుమార్తెలు – పెద్ద కుమార్తె శ్రావంతి, చిన్న కుమార్తె తేజస్వి – అమెరికాలో స్థిరపడ్డారు. తేజస్వి భర్త కిరణ్ కుమార్, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

అయితే ఈ కుటుంబం అక్టోబర్ 18న అమెరికాకు చేరుకుంది. తేజస్వి కొత్త ఇంటికి గృహప్రవేశం చేసుకుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత, శుక్రవారం వారు పెద్ద కుమార్తె శ్రావంతి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లారు. ఆ వేడుకలు ముగిసిన తర్వాత, శనివారం ఉదయం తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారును ఒక టిప్పర్ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో రమాదేవి, తేజస్వి అక్కడికక్కడే మరణించారు. మిగతా కుటుంబ సభ్యులు – విఘ్నేశ్, కిరణ్ కుమార్, తేజస్వి ఇద్దరు పిల్లలు – తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: పవన్ కోసం వర్మ జీరో..? ఆ ఆడియో ఎలా లీకైంది..

Advertisement

ఈ ఘటనపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీని ప ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×