E-Paper
Advertisement

Attack on Indians in US: అమెరికాలో ఆగని దాడులు.. మరో భారతీయుడి మృతి

Attack on Indians in US: అమెరికాలో ఆగని దాడులు.. మరో భారతీయుడి మృతి
Telugu flash news

Executive Vivek Taneja Dies Days After Being Assaulted In US(Telugu flash news): అగ్రరాజ్యంలో భారతీయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. నెలరోజుల వ్యవధిలో వివిధ కారణాలతో ఆరుగురు చనిపోగా.. తాజాగా మరొకరు బలయ్యారు. భారత సంతతికి చెందిన 41 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా.. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో మరణించారు. భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాషింగ్టన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్ వెలుపల ఈ నెల 2న తనేజాపై దాడి జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వరుస దాడుల్లో భారతీయులు టార్గెట్ కావడం ఆందోళన కలిగిస్తోంది.

Read More: Pakistan Results : పాకిస్థాన్ లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. దేశాన్ని ఏలేదెవరు ?

గతవారం హైదరాబాద్‌ యువకుడు సయ్యద్ ముజాహిర్ అలీపై దాడిచేసి దుండగులు దోచుకున్నారు. షికాగోలో ఈ ఘటన చోటుచేసుకోగా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అలాగే, తెలంగాణకు చెందిన శ్రేయాస్‌రెడ్డి బెనిగెర్‌(19)తో పాటు నీల్ ఆచార్య, వివేక్ సైనీ‌(25), అకుల్ ధావన్‌, సమీర్ కమాథ్‌ వేర్వేరు కారణాలతో మృతి చెందారు.

అమెరికాలో ఉన్నత చదువుల కోసం కోటి కలలు, ఆశలతో ఏటా వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు వెళ్తున్నారు. ఇటీవలి కాలంలో వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులకే ఎక్కువ ముప్పు ఉన్నట్టు 2017 నాటి అధ్యయనం చెబుతోంది.

భారత అమెరికన్ల పట్ల వివక్ష స్కూల్ స్థాయి నుంచే ఆరంభమవుతున్నట్టు తేలింది. 2022లో హిందువులు, భారతీయులపై 25 విద్వేష నేరాలు జరిగినట్టు ఆ అధ్యయనం తెలిపింది. 2021లో వీటి సంఖ్య 12 మాత్రమే.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×