E-Paper
Advertisement

Attack on Indians in US: అమెరికాలో ఆగని దాడులు.. మరో భారతీయుడి మృతి

Attack on Indians in US: అమెరికాలో ఆగని దాడులు.. మరో భారతీయుడి మృతి
Advertisement
Telugu flash news

Executive Vivek Taneja Dies Days After Being Assaulted In US(Telugu flash news): అగ్రరాజ్యంలో భారతీయుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. నెలరోజుల వ్యవధిలో వివిధ కారణాలతో ఆరుగురు చనిపోగా.. తాజాగా మరొకరు బలయ్యారు. భారత సంతతికి చెందిన 41 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా.. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో మరణించారు. భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాషింగ్టన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ రెస్టారెంట్ వెలుపల ఈ నెల 2న తనేజాపై దాడి జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో వరుస దాడుల్లో భారతీయులు టార్గెట్ కావడం ఆందోళన కలిగిస్తోంది.

Read More: Pakistan Results : పాకిస్థాన్ లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. దేశాన్ని ఏలేదెవరు ?

Advertisement

గతవారం హైదరాబాద్‌ యువకుడు సయ్యద్ ముజాహిర్ అలీపై దాడిచేసి దుండగులు దోచుకున్నారు. షికాగోలో ఈ ఘటన చోటుచేసుకోగా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అలాగే, తెలంగాణకు చెందిన శ్రేయాస్‌రెడ్డి బెనిగెర్‌(19)తో పాటు నీల్ ఆచార్య, వివేక్ సైనీ‌(25), అకుల్ ధావన్‌, సమీర్ కమాథ్‌ వేర్వేరు కారణాలతో మృతి చెందారు.

అమెరికాలో ఉన్నత చదువుల కోసం కోటి కలలు, ఆశలతో ఏటా వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు వెళ్తున్నారు. ఇటీవలి కాలంలో వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులకే ఎక్కువ ముప్పు ఉన్నట్టు 2017 నాటి అధ్యయనం చెబుతోంది.

Advertisement

భారత అమెరికన్ల పట్ల వివక్ష స్కూల్ స్థాయి నుంచే ఆరంభమవుతున్నట్టు తేలింది. 2022లో హిందువులు, భారతీయులపై 25 విద్వేష నేరాలు జరిగినట్టు ఆ అధ్యయనం తెలిపింది. 2021లో వీటి సంఖ్య 12 మాత్రమే.

Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×