Big Stories

Ayodhya Entry : అయోధ్య రాముడి దర్శనం ఎప్పటినుంచంటే..!

Ayodhya Entry : అయోధ్య రామ మందిరం దర్శనం 2024 సంక్రాంతి నుంచి చేసుకోవచ్చని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. 2022 డిసెంబర్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తవుతాయని చెప్పారు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. ఇప్పటివరకు అయోధ్య రామ మందిర నిర్మాణం 50 శాతం పూర్తయినట్లు చెప్పారు.

- Advertisement -

అయోధ్య రామ మందిర నిర్మాణం మొదలై ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయింది. ఆగస్టు 5, 2020న భూమి పూజ చేసారు ప్రధాని మోది. రూ.1800ల కోట్ల రూపాయలతో రామ మందిర్ ట్రస్ట్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. 2024 జనవరి 14న మకర సంక్రాంతికి ఆలయ గర్భ గుడిలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. ఇక అప్పటి నుంచి ఆలయంలో దర్శనం మొదలౌతుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది.

- Advertisement -

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News