E-Paper
Advertisement

Border Standoff: భారత్, చైనా మధ్య సయోధ్య.. హర్షం వ్యక్తం చేసిన అమెరికా

Border Standoff: భారత్, చైనా మధ్య సయోధ్య.. హర్షం వ్యక్తం చేసిన అమెరికా
Advertisement

Border Standoff: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం గత కొన్ని సంవత్సరాలు నుంచి కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకోకున్నా.. గత కొన్నేళ్లుగా ఇరు పక్షాలు భారీ స్థాయిలో సైనికులను మొహరించడంతో పలు అపోహాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడంతో పాటు భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ఇరు దేశాలు శాంతి నెలకొల్పేందుకు చేస్తున్న కృషితోపాటు సరిహద్దులో సైనికుల తొలగింపు వంటి విషయాలను గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ..

Advertisement

తూర్పు లద్దాఖ్‌లో 2020లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సడలించేందుకు ఇటీవల భారత్, చైనా సైనిక చర్చలు జరిపాయి. ప్రధానంగా ఇందులో ఇరు దేశాల సైనికుల మొహరింపును ఉపసంహరించుకోవాలని చర్చించారు. ఈ విధంగా ఇరు దేశాలు స్నేహ పూర్వక వాతావరణంలో చర్చలు ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో ఇరు దేశాల మధ్య సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు గమనిస్తుంటామని అమెరికా తెలిపింది.

Also Read: ఇటలీలో ప్రధాని మోదీ, గాంధీ విగ్రహం.. ఖలిస్థానీ వేర్పాటు వాదులు..

Advertisement

మద్దతు ఇస్తాం..

చైనాతో నెలకొన్న సరిహద్దు సమస్యల పరిష్కారంపై భారత్ ఫోకస్ చేసిందని భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్య జై శంకర్ వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కర్ట్ కాంప్‌బెల్‌ స్పందించారు. ఇరు దేశాలు సరిహద్దు సమస్యపై ఓ నిర్ణయానికొస్తే.. మద్దతు ఇస్తామని ప్రకటించారు. భారత్‌తో సొంత ద్వైపాక్షిక సంబంధాల కోసం వాషింగ్టన్ సౌకర్యంగా ఉందని, ఈ సమస్య పరిష్కారమై ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Tags

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×