E-Paper
Advertisement

Gandhi’s statue in Italy vandalised: ఇటలీలో ప్రధాని మోదీ, గాంధీ విగ్రహం.. ఖలిస్థానీ వేర్పాటు వాదులు..

Gandhi’s statue in Italy vandalised: ఇటలీలో ప్రధాని మోదీ, గాంధీ విగ్రహం.. ఖలిస్థానీ వేర్పాటు వాదులు..
Advertisement

Gandhi’s statue in Italy vandalised: ప్రధాని నరేంద్రమోదీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఖలిస్థాన్ వేర్పాటు వాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇటలీలో మహాత్మాగాంధీ విగ్రహంపై అభ్యంతరకరమైన రాతలు రాశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు రాతలను చెరిపేసి మహాత్మా పీఠాన్ని శుభ్రం చేశారు.

ఇటలీలో జూన్ 13 నుంచి 15 వరకు జీ 7 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరి వెళ్లారు. అయితే బుధవారం ఇటలీలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని అక్కడ ప్రారంభించా రు. కొద్ది గంటల్లో ఖలిస్థానీ వేర్పాటు వాదులు రంగంలోకి దిగేశారు.

Advertisement

మహాత్మాగాంధీ విగ్రహంపై వివాదాస్పద రాతలు రాశారు. ముఖ్యంగా ఖలిస్తానీ వేర్పాటు వాది హర్దీప్‌సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన రాతలు రాశారు. ఈ విషయం తెలియగానే స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే మహాత్మాగాంధీ విగ్రహం పీఠాన్ని శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటకు ఒకరోజు ముందు ఇలా జరగడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది.

మరోవైపు ఈ ఘటనపై విదేశాంగ కార్యదర్శి క్వాత్రా స్పందించారు. దీన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పుకొచ్చారు. నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడోసారి అధికారం చేపట్టాక తొలిసారి విదేశీ పర్యటన వెళ్తున్నారు. జీ7 సదస్సుకు హాజరుకావడం వరుసగా ఇది ఐదోసారి.

Advertisement

ALSO READ: యూఎస్‌లో ఉద్యోగం పోయింది.. వీడియో చేస్తే లక్షల్లో లైకులు..

ఇప్పుడేకాదు గతంలో ఈ తరహా ఘటనలకు పాల్పడ్డారు ఖలిస్థానీ వేర్పాటు వాదులు. పోయినేడాది కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన విషయం తెల్సిందే.

 

Tags

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×