E-Paper
Advertisement

Bus crash in Iran: బ్రేక్స్ ఫెయిలై బస్సు బోల్తా.. 35 మంది యాత్రికులు మృతి

Bus crash in Iran: బ్రేక్స్ ఫెయిలై బస్సు బోల్తా.. 35 మంది యాత్రికులు మృతి
Advertisement

Bus crash in Iran kills 35 Pakistani pilgrims: ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ నుంచి ఇరాన్ బయలుదేరిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మంది పాకిస్థాన్ యాత్రికులు మృతి చెందారు.

ఇరాన్‌లోని యాజ్ద్‌లో చెక్ పాయింట్ వద్ద బస్సు బోల్తా పడింది. 35 మంది మృతి చెందగా.. 18 మందికి పైగా గాయాలబారిన పడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 53 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికుల్లో ఎక్కువమంది లర్కానా, సింధ్, ఘోట్కీ నగరాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

వివరాల ప్రకారం.. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే బస్సు బోల్తా పడిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులు తప్పించుకునే ప్రయత్నం చేసిన అవకాశం లేకపోవడంతో అక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:  ‘జాకిర్ నాయక్‌ని తిరిగి పంపించేస్తాం.. భారత్‌తో సంబంధాలు ముఖ్యం’: మలేషియా ప్రధాని

Advertisement

సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 17 మంది పురుషులు, 11మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు యాజ్డ్ ప్రావిన్స్ సంక్షోభ నిర్వహణ డైరెక్టర్ జనరల్ చెప్పారు.

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×