NASA Chief Bill Nelson: చైనా అంతరిక్ష కార్యకలాపాలపై నాసా అధిపతి బిల్ నెల్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతకొన్నేళ్లు చైనా తాము చేపడుతున్న అంతరిక్ష కార్యకలాపాలను రహస్యంగా ఉంచుతోందని ఆయన ఆరోపించారు. అక్కడ తమ సైన్యం చేస్తున్న ఆపరేషన్లు బయటకు వెళ్లడించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
దశాబ్దాలకాలం నుంచి చైనా అంతరిక్ష రంగంలో ఎంతో ప్రగతిని సాధించిందని నాసా చీఫ్ బిల్ నెల్సన్ తెలిపారు. కానీ డ్రాగన్ తాము సాధించిన ప్రగతిని అంతా ఎంతో రహస్యంగా దాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటవీల కాలంలో చైనా పౌర కార్యక్రమాల పేరిటి.. గగనతలంలో మిలటరీ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయన్నారు.
ప్రస్తుతం చైనా బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా ఈ రంగానికి కేటాయిస్తుందని అమెరికా చట్టసభ్యులను ఆయన వెల్లడించారు. ఈ విషయంలో చంద్రుడిపైకి వెళ్లడం అమెరికాపై ఉన్న బాధ్యత అని గుర్తు చేశారు. అయితే అమెరికాకంటే చైనా ముందుగా అక్కడికి వెళ్తే.. ఇది మా ప్రదేశం అంటూ.. వేరే వాళ్లకి స్థానం లేదనే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
Also Read: ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం.. పొంచి ఉన్న సునామీ ?
2025 ఏడాదికి గాను నాసా బడ్జెట్ కేటాయింపుల అంశంలో భాగంగా అమెరికా ప్రతినిధుల సభకు ఆయన హాజరై.. చైనా చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవలే నాసా చంద్రుడిపై శాశ్వత నివాసం ఏర్పాటు కొరకు ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది. రానున్న రోజుల్లో కూడా మరిన్ని ప్రాజెక్ట్ లను నాసా చేపట్టనుంది.