E-Paper
Advertisement

Chang’e-5 Mission: చంద్రుడిపై నీటి జాడ.. వెల్లడించిన చైనా

Chang’e-5 Mission: చంద్రుడిపై నీటి జాడ.. వెల్లడించిన చైనా
Advertisement

Chang’e-5 Mission: భారత్ సహా అన్ని ప్రపంచ దేశాలు చంద్రుడి అన్వేషణకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే చాంగే-5 సాయంతో జాబిల్లిపై నుంచి భూమిపైకి మట్టి నమూనాలను తీసుకువచ్చిన చైనా వాటిపై పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ మట్టి ఆధారంగానే చంద్రుడిపై నీటి జాడ ఉన్నట్లు పేర్కొంది. తమ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించినట్లు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.

చంద్రుడిపై మట్టి నమూనాల సేకరణ లక్ష్యంగా 2020లో చైనా చేపట్టిన చాంగే-5 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రుడి ఉపరితలం నుంచి దాదాపు 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను తీసుకువచ్చింది. అనతంరం వాటిపై బీజింగ్ నేషనల్ లేబరేటరీ ఫర్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్ , సీఏఎస్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఆ నమూనాల్లోనే నీటి అణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని సీఏఎస్ ఇటీవల పేర్కొంది. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని ఓ జర్నల్‌లో ప్రచురించినట్లు వెల్లడించింది.

Advertisement

Also Read:మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ లిస్ట్ టాప్‌లో సింగపూర్, మరి ఇండియా ?

చంద్రుడిపై పరిశోధనలో భాగంగా అమెరికాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు 40 ఏళ్ల క్రితమే చంద్రుడిపైకి వెళ్లి మట్టి నమూనాలను సేకరించారు. అనంతరం సోవియట్ యూనియన్ కూడా 1976లో చంద్రుడి మట్టి నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. ఈ రెండు దేశాల తర్వాత జాబిల్లి నుంచి మట్టి సేకరించిన మూడో దేశంగా చైనా నిలిచింది. అయితే 2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 వ్యోమనౌక కూడా చంద్రుడిపై నీటి జాడ ఉన్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×