E-Paper
Advertisement

Congo Boat Capsized 86 People Killed: కాంగోలో పడవ బోల్తా, 86 మంది మృతి.. కారణం అదే..

Congo Boat Capsized 86 People Killed: కాంగోలో పడవ బోల్తా, 86 మంది మృతి.. కారణం అదే..
Advertisement

Congo boat capszed 86 Killed: కాంగోలో విషాదం చోటు చేసుకుంది. ఓ పడవ బోల్తా పడిన ఘటనలో దాదాపు 86 మంది మృతి చెందారు. వంద మందికి పైగానే ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన ఆ దేశ చరిత్రలో అతి పెద్దది. అసలు ఏమైంది?

కాంగో రాజధాని కిన్షాకు సమీపంలోవున్న ఓ నదిలో బోటు ట్రావెల్ చేస్తోంది. అసలే నాటు పడవ, పదుల సంఖ్యలో ఎక్కాల్సిన ప్రయాణికులు పరిమితికి మించి ఎక్కేశారు. ఎంతమందంటే దాదాపు 270 మంది అందులో ప్రయాణిస్తున్నారు. ఓవర్ లోడ్ కారణంగా ఇంజన్‌లో సమస్య తలెత్తింది. దీని కారణంగా పడవ బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 86 మంది స్పాట్‌లో చనిపోయారు. వారంతా ఈత రానివారు. మరో 185 మంది ఒడ్డుకు ఈదుకుంటూ తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇది అధికారులు చెబుతున్న వెర్షన్.

Advertisement

కాంగో పేరు చెప్పగానే దట్టమైన అడవులు గుర్తు కొస్తాయి. అక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే. నదుల కారణంగా సరైన రోడ్డు వ్యవస్థ కూడా లేదు. అందుకే అక్కడి ప్రజలు నాటు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తారు. ఈ క్రమంలో పడవలు బోల్తా పడి పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయిన సందర్భాలు లేకపోలేదు.

ALSO READ: ఇటలీలో ప్రధాని మోదీ, గాంధీ విగ్రహం.. ఖలిస్థానీ వేర్పాటు వాదులు..

Advertisement

అసలు ఇంజన్ పాడైపోతే పడవ ఆగిపోతుంది. కానీ బోల్తా పడిన ఘటనలు లేవని అంటున్నారు. ప్రమాదం సమయంలో బోటులో ఏమైనా గొడవ జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఇంతకీ ఈ బోటు ప్రయాణికులను తీసుకుని వెళ్తుందా? లేక పొరుగు దేశం ఎవరైనా వలస వస్తున్నారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

 

 

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×