E-Paper
Advertisement

USA: భారత్‌ చుక్కల మందుతో కంటిచూపు కోల్పోయిన 55 మంది

USA: భారత్‌ చుక్కల మందుతో కంటిచూపు కోల్పోయిన 55 మంది

USA: భారత్‌లో తయారైన దగ్గుమందు కారణంగా జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఇటువంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. భారత్‌లో తయారైన కంటి చుక్కల మందు వల్ల అగ్రరాజ్యం అమెరికాలో కొందరు కంటిచూపు కోల్పోవడమేగాక.. ఓ మరణం కూడా సంభవించింది.

తమిళనాడులోని చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చుక్కల మందును తయారు చేసింది. ఈ డ్రాప్స్‌ను ఉపయోగించి 12 రాష్ట్రాల్లో దాదాపు 55 మంది కంటిచూపును కోల్పోయారు. అలాగే ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో అమెరికా ఆ చుక్కల మందుపై ఆంక్షలు విధించింది. వైద్యులు, వినియోగదారులు దానిని ఉపయోగించవద్దని హెచ్చరించింది.

ఈక్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై తనిఖీలు నిర్వహించింది. చుక్కల మందు తయారీపై సస్పెన్షన్ విధించింది. యూఎస్‌కు పంపించిన బ్యాచ్‌లకు చెందిన నమూనాలను .. దాని తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలను అధికారులు సేకరించి పరిశోధనలు చేస్తున్నారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×