E-Paper
Advertisement

Earthquake Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు!

Earthquake Japan: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు!
Advertisement

Tsunami warning in Japan after Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమూదైందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. అలాగే జపాన్ దీవులు ఇజు, ఐలాండ్‌లలో రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. ఈ భూకంపం ప్రభావంతో ఒక మీటరు పరిధితో కూడిన సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ భూకంపం తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఐలాండ్ ప్రజలు చెప్పుకొచ్చారు.

Advertisement

ఇదిలా ఉండగా, భూకంపం ప్రభావంతో పెద్దగా ఎలాంటి ప్రకంపనలు చోటుచేసుకోలేదు. కానీ ఈ భూకంప తీవ్రత కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే హచిజో ద్వీపంలోని యానే జిల్లాలో దాదాపు 50 సెంటీమీటర్ల సునామీ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే కొజుషిమా, మియాకేజిమా, ఇజు ఒషిమా ద్వీపాలలో చిన్న అలలు వచ్చినట్లు చెప్పారు. సముద్ర నీరు ఒక్క మీటరు పైకి ఎగిసిపడినా.. సునామీ వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Also Read: భీకర దాడులతో దద్దరిల్లిన లెబనాన్‌.. 356 మంది మృతి!

Advertisement

జపాన్‌లో వరుసగా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. గత రెండు నెలల వ్యవధిలోనే చాలా భూకంపాలు సంభవించాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా సెప్టెంబర్ 21 వ తేదీన చిబా ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 22వ తేదీన ఎహిమ్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించగా.. సెప్టెంబర్ 23వ తేదీన తైవాన్ లో 4.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో జపాన్ ప్రజలు వణికిపోతున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×