E-Paper
Advertisement

Earthquake in Taiwan: తైవాన్‌ను వణికించిన భూప్రకంపనలు.. 9 నిమిషాల వ్య‌వ‌ధిలో ఐదుసార్లు!

Earthquake in Taiwan: తైవాన్‌ను వణికించిన భూప్రకంపనలు.. 9 నిమిషాల వ్య‌వ‌ధిలో ఐదుసార్లు!
Advertisement

Earthquake in Taiwan: ప్రశాంతంగా ఉన్న తైవాన్ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తూర్పు తైవాన్ హులిన్ కౌంటీలోని షౌఫెంగ్ టౌన్ షిప్లో సోమవారం సాయంత్రం నిమిషాల వ్యవధిలోనే రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో ఐదుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

కేవలం 9 నిమిషాల వ్యవధిలో 5 సార్లు భూమి కంపించింది. ఈ వరుస ప్రకంపనలతో ప్రజలు ఇళ్లనుంచి భయటకు పరుగులు తీశారు. సోమవారం సాయంత్రం అక్కడ కాలమానం ప్రకారం 5.08 గంటల నుంచి 5.17 గంటల మధ్య వరుస భూ ప్రకంపనలు సంభవించినట్లు తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

తైపీ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషషన్ కు సంబంధించిన సిస్మోలజీ సెంటర్ తూర్పు కౌటీ హులిన్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. భూమికి 10 కిలోమీటర్లు లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. దీంతో తైపీలో పలు భవనాలు నేలకొరిగాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని.. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని తైవాన్ ప్రభుత్వం వెల్లడించింది.

Also Read: ట్రాక్ పై నుంచి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి

Advertisement

అయితే రెండు వారాల కిందట తూర్పు తైవాన్ లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా 14 మంది మరణించగా దాదాపు 700 మందికి పైగా గాయాలపాయ్యారు. భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్లు తైవాన్ అధికారులు వెల్లడించారు.

కాగా, ఏప్రిల్ 3న సంభంవించిన ఆ భూకంపం కారణంగా హులిన్ సిటీలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కౌంటీలో దాదాపు 130 మందికి పైగా గాయలపాలయ్యారు. దీంతో రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో వరుస ప్రకంపనలు రావడంతో ప్రజలు మరోసారి భయభ్రాంతులకు గురయ్యారు.

Tags

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×