E-Paper
Advertisement

Suicide Bomb Attack in Pakistan: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనా ఇంజనీర్లు మృతి!

Suicide Bomb Attack in Pakistan: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనా ఇంజనీర్లు మృతి!
Advertisement

Suicide Bomb Attack

5 Chinese Nationals Suicide Bomb Attack in Pakistan: పాకిస్థాన్ లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చైనా జాతీయులు మృతి చెందారు. వీరిలో పాటుగా ఓ స్థానికూడా మరణించాడు. చైనీస్ ఇంజనీర్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై దాడి జరిగింది. దీంతో అందులో ఉన్న వారు అక్కడికక్కడే మరణించారు.

Advertisement

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చైనీస్ ఇంజనీర్లు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై దాడి జరిగిన క్రమంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో చైనీయులతో పాటుగా ఓ స్థానికుడు మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఆత్మాహుతి దాడిపై సమాచారం అందిన వెంటనే.. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

ఇస్లామాబాద్ నుంచి దాసులో తమ క్వాంప్ నకు చైనా ఇంజనీర్ల కాన్వాయ్ వెళుతుండగా పేలుడు పదార్థాలు నింపిన వాహనం వారి కాన్వాయ్ ను ఢీకొట్టింది. చైనీస్ కాన్వాయ్ లోయలోకి పడపోయి.. భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కొందరు కాన్వాయ్ నుంచి ప్రాణాలతో బయటపడ్డారని పాక్ పోలీసులు తెలిపారు. అయితే దాసు ప్రాంతంలో గతంలో కూడా చైనా జాతీయులను లక్ష్యంగా చాలా దాడులు జరిగాయి.

Advertisement

Also Read: Bridge Collapse: ఘోర ప్రమాదం.. నౌక ఢీకొని ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన

అయితే ఈ ఆత్మాహుతి దాడి ఘటనను పాకిస్థాన్ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. చైనా జాతీయుల మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాక్ లోని ఎన్ని వ్యతిరేక శక్తులు ఉన్నాసరే పాక్-చైనా మధ్య స్నేహాన్ని దెబ్బతీయలేవని జర్దారీ వెల్లడించారు. ఈ ఆత్మాహుతి దాడికి తమదే బాధ్యత అని ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. దీంతో పాక్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇదే ప్రాంతంలో 2021లో బస్ పై బాంబు దాడి జరగగా.. 9 మంది చైనా జాతీయలతో పాటుగా మరి కొంద మంది పాక్ జాతీయులు మరణించారు. ఇక 2023 ఆగస్ట్ లో పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో చైనా ఇంజనీర్ల కాన్వాయ్ పై సాయుధ రెబెల్స్ దాడి చేశారు.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×