E-Paper
Advertisement

India Germany : ఫోకస్ ఆన్ ఇండియాను భారత్ స్వాగతిస్తోంది, ఛాన్సలర్‌’తో ప్రధాని మోదీ కీలక ద్వైపాక్షిక చర్చలు

India Germany : ఫోకస్ ఆన్ ఇండియాను భారత్ స్వాగతిస్తోంది, ఛాన్సలర్‌’తో ప్రధాని మోదీ కీలక ద్వైపాక్షిక చర్చలు
Advertisement

India Germany : జర్మనీ ప్రవేశపెట్టిన ఫోకస్ ఆన్ ఇండియా కార్యక్రమానికి భారత్ మద్ధతు తెలియజేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రదేశం భారత్ అని అభిప్రాయపడ్డారు.

రష్యా ఉక్రెయిన్ వార్ ఆపండి మోదీజీ…

Advertisement

భారత్‌ జర్మనీ 7వ ‘ఇంటర్ గవర్నమెంటల్‌ కన్సల్టేషన్స్‌’ చర్చల్లో భాగంగా జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌తో (Olaf Scholz) భారత్ విచ్చేశారు. ఈ మేరకు దేశ రాజధాని దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఒలాఫ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ సమస్యకు పరిష్కారం తెచ్చేందుకు భారత్‌ చొరవ చూపించాలని ఆయన కోరారు.

భారత్ రెఢీగానే ఉంది…

Advertisement

దీంతో ప్రధాని మోదీ సానుకూలమైన సమాధానం ఇచ్చారు.  ఉక్రెయిన్‌, పశ్చిమాసియాలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మోదీ, వీలైనంత తొందరగా వాటిని పరిష్కారించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ కూడా ఆ దిశగా కృషి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు యుద్ధాలతో సమస్యలు సమసిపోతాయని భారత్‌ ఎప్పటికీ భావించదన్నారు.

కొత్త సంస్కరణలు అవసరం…

ఇక 20వ శతాబ్దంలో ఏర్పాటైన ప్రపంచ వేదికలు, కన్వెన్షన్లు, 21 శతాబ్దపు సవాళ్లను పరిష్కరించేందుకు సరిపోవట్లేదని మోదీ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలితో పాటు మిగతా అంతర్జాతీయ సంస్థల్లో వేగవంతమైన సంస్కరణలు తీసుకురావాల్సిన సమయం వచ్చిందన్నారు. మోదీ ప్రతిపాదనలకు జర్మన్ ఛాన్సలర్ మద్ధతు ఇవ్వడం విశేషం.

వ్యూహాత్మకమైన భాగస్వామ్యం…

దిల్లీలో ఇంటర్‌ గవర్నమెంటల్‌ కన్సల్టేషన్స్‌ సదస్సును మోదీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా అలజడులు, అల్లర్లు, ఉద్రిక్తతలు, విభేదాలు ముసురుకున్నాయన్నారు. అయినప్పటికీ భారత్‌, జర్మనీల మధ్య వ్యూహాత్మకమైన భాగస్వామ్యం నెలకొందన్నారు. ఇదే ఇరుదేశాల అభివృద్ధికి గట్టి పునాదిగా మారిందన్నారు.

బలమైన ప్రజాస్వామ్యానికి పునాది…

ఒక్క లావాదేవీల వరకే ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం పరిమితం కాలేదన్నారు. రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాల పరివర్తనకు నిదర్శనంగా మారాయన్నారు.

also read : రేపే తెలంగాణ మంత్రివర్గ సమావేశం, ఈసారి వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×