E-Paper
Advertisement

Houthi Attacks : హౌతీ దాడులు.. గ్లోబల్ ట్రేడ్ కుదేలు!

Houthi Attacks : హౌతీ దాడులు.. గ్లోబల్ ట్రేడ్ కుదేలు!
Advertisement
Houthi Attacks

Houthi Attacks : ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈ మార్గంలో పయనించే వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకుని హౌతీ రెబెల్స్ మూడు నెలలుగా విరుచుకుపడుతున్నారు. ఫలితంగా గ్లోబల్ ట్రేడ్ 1.3% మేర పడిపోయింది. ఎర్రసముద్రం మీదుగా ప్రస్తుతం రోజుకు 2 లక్షల కంటెయినర్ల రవాణా జరుగుతోంది. నవంబర్‌లో ఈ సంఖ్య 5 లక్షలని జర్మనీకి చెందిన ఓ ఆర్థిక అధ్యయన సంస్థ వెల్లడించింది.

దాడుల ఫలితంగా నౌకల రూటు మారింది. ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా రెడ్ సీ, సూయిజ్ కాల్వ అయితే 18,520 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లాల్సి రావడంతో ఈ దూరం 25,002 కిలోమీటర్లకి చేరింది. అంటే అదనంగా 6,752 కిలోమీటర్లు ప్రయాణించాలన్న మాట.

Advertisement

అయినా.. మియాస్క్(Maersk), హపగ్ లాయడ్(Hapag-Lloyd) వంటి షిప్పింగ్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ నౌకలను ఈ మార్గంలోనే పంపుతున్నాయి. దీని వల్ల దూరం పెరగడమే కాదు.. అధిక సమయం కూడా తీసుకుంటుంది. డైవర్షన్ కారణంగా దాదాపు 8.5 రోజుల సమయం ఎక్కువ తీసుకుంటుంది. జర్మనీ, ఈయూ దేశాల అంతర్జాతీయ వాణిజ్యం తగ్గడానికి ఇది కూడా కారణమే.

మరోవైపు, రవాణా చేయాల్సిన సరుకు నిల్వలు రేవుల్లో నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజా ఉద్రిక్తతల కారణంగా బెర్లిన్‌లోని టెస్లా కార్ల ఉత్పత్తికి బ్రేక్ పడింది. విడి పరికరాలు అందని కారణంగా ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఎగుమతులు 2% క్షీణించగా.. దిగుమతులు 3.1% మేర తగ్గాయి. అమెరికాకు రెడ్ సీ సముద్ర వాణిజ్య మార్గం అంత కీలకం కాకున్నా.. ఆ దేశం ఎగుమతులు 1.5% , దిగుమతులు 1% మేర తగ్గిపోయాయి.

Advertisement

చైనా ఎగుమతులు, దిగుమతులకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేకున్నా.. కొత్త సంవత్సరం (ఫిబ్రవరి 10)నాటికి డ్రాగన్ దేశానికి కూడా ప్రతికూలతలు తప్పవని వాణిజ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 2% పెరిగాయి. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 15% ఎర్ర సముద్రం ద్వారానే జరుగుతోంది. 8% ఆహారధాన్యాలు, 12% ఆయిల్, 8% సహజవాయువు రవాణా జరుగుతోంది.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×