E-Paper
Advertisement

Houthi Attacks : హౌతీ దాడులు.. గ్లోబల్ ట్రేడ్ కుదేలు!

Houthi Attacks : హౌతీ దాడులు.. గ్లోబల్ ట్రేడ్ కుదేలు!
Advertisement
Houthi Attacks

Houthi Attacks : ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈ మార్గంలో పయనించే వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకుని హౌతీ రెబెల్స్ మూడు నెలలుగా విరుచుకుపడుతున్నారు. ఫలితంగా గ్లోబల్ ట్రేడ్ 1.3% మేర పడిపోయింది. ఎర్రసముద్రం మీదుగా ప్రస్తుతం రోజుకు 2 లక్షల కంటెయినర్ల రవాణా జరుగుతోంది. నవంబర్‌లో ఈ సంఖ్య 5 లక్షలని జర్మనీకి చెందిన ఓ ఆర్థిక అధ్యయన సంస్థ వెల్లడించింది.

దాడుల ఫలితంగా నౌకల రూటు మారింది. ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా రెడ్ సీ, సూయిజ్ కాల్వ అయితే 18,520 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లాల్సి రావడంతో ఈ దూరం 25,002 కిలోమీటర్లకి చేరింది. అంటే అదనంగా 6,752 కిలోమీటర్లు ప్రయాణించాలన్న మాట.

Advertisement

అయినా.. మియాస్క్(Maersk), హపగ్ లాయడ్(Hapag-Lloyd) వంటి షిప్పింగ్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ నౌకలను ఈ మార్గంలోనే పంపుతున్నాయి. దీని వల్ల దూరం పెరగడమే కాదు.. అధిక సమయం కూడా తీసుకుంటుంది. డైవర్షన్ కారణంగా దాదాపు 8.5 రోజుల సమయం ఎక్కువ తీసుకుంటుంది. జర్మనీ, ఈయూ దేశాల అంతర్జాతీయ వాణిజ్యం తగ్గడానికి ఇది కూడా కారణమే.

మరోవైపు, రవాణా చేయాల్సిన సరుకు నిల్వలు రేవుల్లో నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజా ఉద్రిక్తతల కారణంగా బెర్లిన్‌లోని టెస్లా కార్ల ఉత్పత్తికి బ్రేక్ పడింది. విడి పరికరాలు అందని కారణంగా ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఎగుమతులు 2% క్షీణించగా.. దిగుమతులు 3.1% మేర తగ్గాయి. అమెరికాకు రెడ్ సీ సముద్ర వాణిజ్య మార్గం అంత కీలకం కాకున్నా.. ఆ దేశం ఎగుమతులు 1.5% , దిగుమతులు 1% మేర తగ్గిపోయాయి.

Advertisement

చైనా ఎగుమతులు, దిగుమతులకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేకున్నా.. కొత్త సంవత్సరం (ఫిబ్రవరి 10)నాటికి డ్రాగన్ దేశానికి కూడా ప్రతికూలతలు తప్పవని వాణిజ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 2% పెరిగాయి. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 15% ఎర్ర సముద్రం ద్వారానే జరుగుతోంది. 8% ఆహారధాన్యాలు, 12% ఆయిల్, 8% సహజవాయువు రవాణా జరుగుతోంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×